Don't Miss!
- Finance SBI MF: ప్రైవేట్ బ్యాంక్ దెబ్బతో రూ. 1,200 కోట్లకు పైగా నష్టపోయిన ఎస్బీఐ మ్యుచువల్ ఫండ్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నారప్ప కోసం నిరాహార దీక్ష.. ఆ ఒక్క పోస్టర్ తో క్లారిటీ ఇచ్చేసిన సురేష్ ప్రొడక్షన్స్!
విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా నారప్ప డిజిటల్ వేదికగా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సురేష్ బాబు దానికి సంబంధించిన డీల్ కూడా క్లోజ్ చేశారంటూ ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఏకంగా ఒక వ్యక్తి ఈ నిరాహార దీక్షకు దిగడం ఆసక్తి రేకెత్తిస్తోంది దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే
నారప్ప డిజిటల్ రిలీజ్
ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఇతర భాషలలో సూపర్ హిట్ గా నిలిచిన సినిమాలను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. అందులో భాగంగానే తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన అసురన్ సినిమాను తెలుగులో నారప్ప అనే పేరుతో రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా ఓటీటీ డీల్ కుదిరిందని జూలై 24న నేరుగా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.
నిరాహారదీక్షకు
ఈ క్రమంలో ఒక అభిమాని అయితే ఏకంగా నిరాహార దీక్షకు దిగడం ఆసక్తికరంగా మారింది. వరంగల్ కు చెందిన కిరణ్ అనే అతను విక్టరీ వెంకటేష్ కి వీరాభిమాని, వెంకటేష్ సినిమా రిలీజ్ అయిందంటే కచ్చితంగా ఆ సినిమాను మార్నింగ్ షో చూడాల్సిందే. ఇక థియేటర్ కి వెళ్లి రచ్చరచ్చ చేస్తూ ఉండాల్సిందే. అలాంటిది ఆయన సినిమా డైరెక్ట్ గా ఓటీటీ లో రిలీజ్ అవుతుంది అన్న విషయం తెలుసుకుని తన బాధను వ్యక్తం చేస్తూ ఒక రోజు పాటు నిరాహార దీక్షకు దిగుతున్నట్లు ప్రకటించారు.
సెన్సార్ అవసరమేనా
అయితే మరి ఈయన బాధ అర్థం చేసుకున్నారో ఏమో తెలియదు కానీ తాజాగా ఈ సినిమా సెన్సార్ కు పంపించడం ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి డిజిటల్ రిలీజ్ చేయాల్సిన సినిమా విషయంలో చాలా రోజులనుంచి సెన్సార్ విధానాలు పాటించడం లేదు. ఒకవేళ అప్పటికే థియేటర్ రిలీజ్ కోసం సిద్ధం చేసుకున్న సినిమాలు అయితేనే సెన్సార్ కు పంపడం ఆనవాయితీగా వస్తోంది.
సెన్సార్ సర్టిఫికెట్
కానీ ఆసక్తికరంగా ఇప్పుడు సురేష్ ప్రొడక్షన్ సంస్థ నుంచి వస్తున్న ఈ సినిమా ఏకంగా సెన్సార్ కూడా పూర్తి చేసుకుని యు ఏ సర్టిఫికెట్ తెచ్చుకోవడం ఆసక్తికరంగా మారింది. దీంతో ఇప్పటివరకు జరిగిన ఈ డిజిటల్ రిలీజ్ ప్రచారం ఒట్టిదే అని సినిమాను నేరుగా థియేటర్లలోనే రిలీజ్ చేయబోతున్నారు అని అంటున్నారు కొందరు సినీ జనాలు.
ఆయన నోరు విప్పితే కానీ నో క్లారిటీ
అయితే డిజిటల్ లో రిలీజ్ చేసే సినిమాలకు కూడా కొన్నిసార్లు సెన్సార్ చేయించారని ఇంకొందరు అంటునారు. సురేష్ బాబు కనుక ఈ విషయం మీద స్పందిస్తే కానీ దీనిని డిజిటల్ లో రిలీజ్ చేస్తున్నారో లేక థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారో అనే అంశం మీద క్లారిటీ రాకపోవచ్చని కూడా అంటున్నారు. మరి సురేష్ బాబు ఈ అంశం మీద స్పందించి క్లారిటీ ఇస్తారో ? లేదో ? వేచి చూడాల్సిందే.