Don't Miss!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- News దేశంలో ఫస్ట్ టైమ్, పోలీసులకు ఏసీ హెల్మెట్లు, ప్రభుత్వం అంటే ఇలా ఉండాలి, పండగే పండగ !
- Sports LSG vs CSK: రూ. కోట్లు పలికిన ఆ ఇద్దరిని తప్పించాం- రుతురాజ్
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మా సినిమాకు నష్టాలా? వాస్తవాలు రాయండి.. టీవీ ఛానెల్పై నిర్మాత ఫైర్
తమిళ సూపర్స్టార్ తలపతి విజయ్ నటించి బిగిల్ చిత్రం గతేడాది దీపావళీ పండుగ కానుకగా రిలీజై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. పుట్బాల్ క్రీడా నేపథ్యంగా అట్లీ దర్శకత్వంలో ఏఆర్ రెహ్మాన్ సంగీత దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలిగించింది. అయితే ఈ చిత్రం నష్టాలను చవి చూసిందని జాతీయ మీడియా రాసిన కథనం వివాదంగా మారింది. ఆ కథనంపై బిగిల్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అర్చన కల్పతి ఘాటుగా స్పందించారు. అసలు ఈ వివాదం వెనుక అసలు కథ ఏమిటంటే..
రూ.300 కోట్లకుపైగా వసూళ్లు
విజయ్ హీరోగా నయనతార, జాకీ ష్రాఫ్, కదీర్, వివేక్, యోగిబాబు, ఆనంద్ రాజ్ నటించిన ఈ సినిమా తొలి ఆట నుంచి విడుదలైన అన్నీ కేంద్రాల్లో హిట్ టాక్ను సొంతం చేసుకొన్నది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ రికార్డులు సొంతం చేసుకొని అత్యధిక వసూళ్లను సాధించింది దాదాపు ఈ చిత్రం రూ.300 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది.
రూ.20 కోట్ల నష్టమని
అయితే జాతీయ ఛానెల్కు సంబంధించిన ఓ వెబ్సైట్ బిగిల్కు నష్టాలు వచ్చాయని కథనాన్ని రాసింది. తమ చిత్రానికి రూ.20 కోట్లు వచ్చాయని నిర్మాత అర్చన కల్పతి చెప్పినట్టు వచ్చిన వార్తపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. బిగిల్ సినిమాకు నష్టాలు వచ్చినట్టు తాను ఎక్కడా వెల్లడించలేదు అని ఆమె స్పష్టం చేశారు.
వార్తలు రాసే ముందు వాస్తవాలు తెలుసుకోండి
బిగిల్ సినిమాకు నష్టాలు వచ్చాయని చెప్పినట్టు వచ్చిన వార్తపై అర్చన కల్పతి ట్విట్టర్లో స్పందించారు. ఏదైనా వార్త రాసే ముందు వాస్తవాలు చెక్ చేసుకోవాలి. బిగిల్ సినిమాకు రూ.20 కోట్ల నష్టం వచ్చిందని నేను ఇప్పటి వరకు ఏ ఇంటర్వ్యూలో వెల్లడించలేదు అని ఘాటుగా ట్విట్టర్లో ఓ మెసేజ్ పోస్టు చేశారు. దీంతో బిగిల్ నష్టాల వివాదాలకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు.
Recommended Video
180 కోట్ల బడ్జెట్తో
ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై కల్పతి ఎస్ అఘోరం, కల్పతి ఎస్ గణేష్, కల్పతి ఎస్ సురేష్ నిర్మాణ సారథ్యంలో సుమారు రూ.180 కోట్ల వ్యయంతో తెరకెక్కింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లు సాధించింది. అక్టోబర్ 25వ తేదీన రిలీజై విజయ్ కెరీర్లో అత్యుత్తమ వసూల్లు సాధించిన చిత్రంగా రికార్డును సొంతం చేసుకొన్నది.