Don't Miss!
- News షర్మిల గురి మారిందా - వారి ఆశలపై నీళ్లు, ఫలితం తారుమారు..!!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్ను కూడా
- Finance RBI: 2000 నోట్లపై కీలక ప్రకటన చేసిన ఆర్బీఐ..
- Technology 50MP సెల్ఫీ కెమెరా తో Samsung కొత్త ఫోన్! లాంచ్,ధర వివరాలు
- Automobiles ప్రపంచంలోనే 'ది బెస్ట్ కారు' ఇదే.. 29 దేశాల నుంచి 100 మంది ఆటో మొబైల్ జర్నలిస్ట్లు ఎంపిక చేసిన కారు ఏదంటే??
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
బాక్సాఫీస్ను హడలెత్తించిన విజయ్.. లాక్డౌన్లో కూడా రిలీజ్కు ముందే 200 కోట్లు
తమిళ సూపర్ స్టార్ విజయ్ బాక్సాఫీస్ స్టామినా, రేంజ్కు మాస్టర్ చిత్రం మరోసారి అద్దం పట్టింది. రిలీజ్కు ముందే ఈ చిత్రం రికార్డు స్థాయిలో బిజినెస్ చేయడం ఇప్పుడు తమిళ చిత్రం పరిశ్రమలో చర్చనీయాంశమైంది. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గురించి నిర్మాత జేవియర్ బ్రిట్టో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత చేసిందంటే...
వాయిదాల పర్వంలో మాస్టర్ రిలీజ్
మాస్టర్ చిత్రాన్ని ఏప్రిల్ 2020లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే కరోనావైరస్ వ్యాప్తి, లాక్డౌన్ పరిస్థితులు అడ్డు పడటంతో మాస్టర్ చిత్రం రిలీజ్ వాయిదా పడింది. అయితే మాస్టర్ సినిమా డేట్ దగ్గరపడటంతో దర్శకుడు లోకేష్ హడావిడిగా సినిమాను సిద్ధం చేశాడు. అయితే లాక్డౌన్ సమయం కలిసి రావడంతో మరోసారి కొత్తగా సీన్లను చేర్చి సినిమాను మరింత ఫర్ఫెక్ట్గా చేశారు. విజయ్ కూడా మార్పులు చాలా నచ్చాయి అని జేవీయర్ బొట్టో తెలిపారు.
మరోసారి లోకేష్తో విజయ్ సినిమా
దర్శకుడు లోకేష్ కనకరాజ్ సినిమా రూపొందించిన తీరుపై విజయ్ థ్రిల్ అయ్యారు. లోకేష్ ప్రతిభ, సినిమాను రూపొందించే విధానంపై సంతృప్తి చెందారు. మరోసారి లోకేష్తో విజయ్ సినిమా చేయడానికి ఆసక్తిగా ఉన్నారు. మా కాంబినేషన్లో మరో సినిమా రాబోతున్నది అని నిర్మాత జేవీయర్ బ్రిట్టో అన్నారు.
ప్రీ రిలీజ్ బిజినెస్ 200 కోట్లు
మాస్టర్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరిగింది. ఈ చిత్రం మొత్తం 200 కోట్ల మేర బిజినెస్ చేసింది. థియేట్రికల్ రైట్స్ 70 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. అయితే మేము ఈ సినిమాను తొందరపడి రిలీజ్ చేయడం లేదు. ఓటీటీలో రిలీజ్ చేయడం లేదు. ఎన్ని రోజులైనా ఆగి థియేట్రికల్ రిలీజ్ చేస్తాం అని జేవియర్ బ్రిట్టో వెల్లడించారు.
థియేటర్ రిలీజ్ కోసమే డిస్టిబ్యూటర్లు
లాక్డౌన్ కారణంగా థియేటర్ల మూసివేతతో మాస్టర్ సినిమా రిలీజ్ ఆగిపోవడంపై డిస్టిబ్యూటర్లలో ఎలాంటి ఆందోళన లేదు. మా డబ్బు తిరిగి ఇవ్వమని డిస్టిబ్యూటర్ల నుంచి ఎలాంటి ఒత్తిడి లేదు. వారు కూడా థియేటర్ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు. త్వరలోనే కరోనా పరిస్థితులు అదుపులోకి వస్తాయనే ఆశాభావంతో ఉన్నాం అని జేవీయర్ పేర్కొన్నారు.
Recommended Video
2021 సంక్రాంతి బరిలో మాస్టర్
సూపర్ స్టార్ విజయ్ ప్రొఫెసర్గా నటిస్తున్న మాస్టర్ చిత్రాన్ని 2021 సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినట్టు తెలుస్తున్నది. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి విలన్గా కనిపించబోతున్నారు. మాళవిక మోహన్ హీరోయిన్గా నటించింది. సినీ వర్గాల్లోనే కాకుండా, ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.