Don't Miss!
- Sports హార్దిక్పై కోపంగా మలింగ.. కారణమదేనా? Video
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- News బీజేపీకి అనపర్తి సీటు కేటాయింపు వెనుక వైసీపీ..!?
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Finance Rain Tax: ఆ నగరంలో ప్రజలపై వర్షం టాక్స్..! ఏప్రిల్ నుంచి దబిడిదిబిడేనా..??
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
- Automobiles బుల్లితెర నటి 'ప్రజ్ఞా భట్' కొత్త కారు చూసారా.. ధర ఎంతో తెలుసా?
విక్రమ్ ‘శివ తాండవం’ఫైనల్ రిజల్ట్
హైదరాబాద్ : జాతీయ ఉత్తమనటుడు విక్రమ్ నటించిన 'శివ తాండవం'చిత్రం మొన్న శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం 'తాండవం' అనే తమిళ చిత్రానికి డబ్బంగై తెలుగుకు వచ్చింది. తమిళంలోనూ నెగిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం వారం తేడాలో ఇక్కడా విడుదలైంది. అయితే తెలుగులోనూ అంచనాలు అందుకోలేక బోల్తా పడింది. మరో ప్రక్క ఈ చిత్రంలో జగపతిబాబు నటించినా కూడా సినిమాకు ప్లస్ కాలేకపోయాడు. అందులోనూ జగపతిబాబు నెగిటివ్ హీరోయిజం జనాలకి నచ్చటం లేదని అంటున్నారు.
తెలుగులో ఈ చిత్రాన్ని సి. కల్యాణ్ భారీ స్థాయిలో 290 థియేటర్లలో విడుదల చేశారు. తెలుగులో విక్రమ్ సినిమాల్లో హయ్యెస్ట్ గ్రాసర్గా నిలుస్తుందని చెప్పారు. కానీ సినిమా స్లోగా ఉండటం మైనస్ గా మారింది. విక్రమ్ ఈ చిత్రంలో పగ తీర్చుకునే అంధుడిలా కనిపించారు. మరో ప్రక్క సినిమాలో 'గజని'ఛాయిలు ఉండటం కూడా సినిమాపై నెగిటివ్ టాక్ వచ్చేలా చేసింది. కథ ప్రకారం ఈ చిత్రంలో శివ కుమార్ గా విక్రమ్ కనపడతారు. అతను ఇండియాలోని బెస్ట్ రా ఏజెంట్ లలో ఒకరు. హ్యాపీగా మీనాక్షి(అనూష్క)తో మ్యారేడ్ లైఫ్ గడుపూతూంటాడు. ఆమె ఓ ఆప్తమాలజిస్ట్...ఎంతో మంది గుడ్డి వాళ్లకి ఆమె తన ఫౌండేషన్ ద్వారా వెలుగు చూపిస్తూంటుంది. శివకి బెస్ట్ ప్రెండ్ శరత్(జగపతిబాబు). అతను రా లోనే విక్రమ్ తర్వాత బెస్ట్ ఆఫీసర్ గా చేస్తూంటాడు. నేషనల్ సెక్యూరటీకి చెందిన ఓ కేసులో అనుమానితుడ్ని ఇంటరాగేట్ చేస్తూండగా అతనిపై దాడి జరిగి హాస్పటిల్ లో చేరతాడు. అక్కడినుంచి కథ మలుపుతిరుగుతుంది.
తన స్నేహితుడు పై దాడి జరిపిన వారి అంతు తేల్చడానికి, ఆ కేసు హ్యాండోవర్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ నిమిత్తం లండన్ వెళ్లి ఊహించని విధంగా కళ్లు పోగొట్టుకుంటాడు. అప్పుడు తాను ట్రాప్ కి గురి అయ్యానని తెలుసుకుంటాడు. అతన్ని ట్రాప్ చేసింది మరెవరో కాదు టెర్రరిస్టులతో చేతులు కలిపిన శరత్. ఇండియన్ మిలిట్రీకి చెందిన ఓ కాన్ఫిడెన్సియల్ మ్యాటర్ ని టెర్రరిస్టులకు అమ్మాలని అతని ప్లాన్. ఈ లోగా తన భర్త శివ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్దామని లండన్ లో ల్యాండ్ అవుతుంది మీనాక్షి(అనుష్క). అయితే ఆమెని సైతం బాంబ్ బ్లాస్ట్ లో చంపేస్తారు. అప్పుడు తన భార్యని చంపి,తనని గుడ్డివారిని చేసి,దేశ రహస్యాలను అమ్మాలనుకునేవారికి గుడ్డి వాడైన శివ ఎలా బుద్ది చెప్పాడు అనేది మిగతా కథ.