twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Virata Parvam 4 Days Collections: దారుణంగా పడిపోయిన వసూళ్లు.. హిట్టు కొట్టాలంటే ఇంకా అన్ని కోట్లు!

    |

    తెలుగు ప్రేక్షకులు ఈమధ్య రియలిస్టిక్ సినిమాలకు బాగా కనెక్ట్ అవుతున్నారు. అందులో భాగంగానే ప్రేమకు నక్సలైట్ ఉద్యమాన్ని జోడించి తెరకెక్కించిన 'విరాట పర్వం' సినిమా ఈ మధ్యనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వరంగల్ లో జరిగిన రియల్ స్టోరీని బేస్ చేసుకుని రూపొందిన ఈ సినిమాలో దగ్గుబాటి రానా - సాయి పల్లవి జంటగా నటించారు. ఫలితంగా ఈ సినిమాకి మంచి బిజినెస్ జరిగింది. సినిమా విడుదలయ్యాక టాక్ మంచిగానే వచ్చింది కానీ, కలెక్షన్లు మాత్రం నిరాశాజనకంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసలు 'విరాట పర్వం' మూవీ నాలుగు రోజుల్లో ఎంత వసూలు చేసింది? హిట్ అవ్వాలంటే ఇంకెంత రావాలి? అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

    భారీ అంచనాలతో

    భారీ అంచనాలతో

    దగ్గుబాటి రానా - సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో వేణు ఉడుగుల రూపొందించిన సినిమా 'విరాట పర్వం'. ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాను సురేష్ బాబు సురెష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పేరు మీద సమర్పించారు. సురేష్ బొబ్బిలి స్వరాలు అందించిన ఈ సినిమాలో నివేదా పేతురాజ్, ప్రియమణి, నందితాదాస్‌, నవీన్‌చంద్ర, జరీనా వహాబ్‌, ఈశ్వరీరావు, సాయి చంద్, బెనర్జీ వంటి వారు ప్రధాన పాత్రలను పోషించారు. ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 14 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్‌ జరిగింది.

    4వ రోజు తెలుగు రాష్ట్రాల్లో

    4వ రోజు తెలుగు రాష్ట్రాల్లో

    తెలుగు రాష్ట్రాల్లో 'విరాట పర్వం'కు 4వ రోజు కలెక్షన్స్ విషయంలో పెద్ద షాక్ తగిలినట్టు అయింది. ఫలితంగా నైజాంలో రూ. 9 లక్షలు, సీడెడ్‌లో రూ. 2 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 3 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 1 లక్ష, గుంటూరులో రూ. 2 లక్షలు, కృష్ణాలో రూ.2 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షతో.. రెండు రాష్ట్రాల్లో రూ.22 లక్షలు షేర్ తెచ్చుకుంది.

    4 రోజులకు కలిపి

    4 రోజులకు కలిపి

    'విరాట పర్వం' మూవీకి నాలురో రోజుల్లో కలెక్షన్స్ విషయంలో నిరాశే ఎదురైంది. ఫలితంగా 4 రోజులకు గాను నైజాంలో రూ. 1.20 కోట్లు, సీడెడ్‌లో రూ. 19 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 23 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 17 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 14 లక్షలు, గుంటూరులో రూ. 17 లక్షలు, కృష్ణాలో రూ. 14 లక్షలు, నెల్లూరులో రూ. 9 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ.2.31 కోట్లు షేర్, రూ. 3.80 కోట్లు గ్రాస్ మాత్రమే వచ్చింది.

    ప్రపంచ వ్యాప్తంగా గడ్డు పరిస్థితి

    ప్రపంచ వ్యాప్తంగా గడ్డు పరిస్థితి

    4 రోజుల్లో ఏపీ, తెలంగాణలో కేవలం రూ. 2.31 కోట్లు షేర్ మాత్రమే రాబట్టిన 'విరాట పర్వం' ప్రపంచ వ్యాప్తంగానూ కూడా గడ్డు పరిస్థితి ఎదుర్కొంది. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 28 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 93 లక్షలు వసూలు చేసింది. వీటితో కలిపి 4 రోజుల్లో దీనికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 3.52 కోట్ల షేర్‌తో పాటు రూ. 6.05 కోట్లు గ్రాస్‌ మాత్రమే వసూలు అయింది.

    సోమవారం మరీ దారుణంగా

    సోమవారం మరీ దారుణంగా

    క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'విరాట పర్వం' సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 14 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 14.50 కోట్లుగా నమోదైంది. ఇక, 4 రోజుల్లో దీనికి రూ. 3.52 కోట్లు షేర్ వచ్చింది. అంటే మరో 10.98 కోట్లు వస్తేనే ఇది హిట్ స్టేటస్‌ను అందుకుంటుంది. వీకెండ్‌లోనూ వసూళ్లు డౌన్ అవుతూనే వచ్చిన ఈ సినిమాకి సోమవారం మరింత దారుణంగా వసూళ్ళు వచ్చాయి. సోమవారం నాడు దారుణంగా నాని సినిమా కంటే తక్కువ షేర్ రావడం అందరినీ షాక్‌కు గురి చేస్తోంది.

    English summary
    Rana Daggubati -Sai Pallavi's ‘Virata Parvam’ Under Venu Udugula Direction Collects Rs 3.52 Crores in 4 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X