Virata Parvam 9 Days Collections: వీకెండ్లో విరాట పర్వంకు షాక్.. 14 కోట్లకు ఎంతొచ్చిందో తెలిస్తే!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో యదార్థ సంఘటనల ఆధారంగా ఎన్నో సినిమాలు వస్తున్నాయి. అందులో చాలా వరకూ విజయాలను అందుకోవడంతో దర్శక నిర్మాతలు, హీరోలు అదే తరహా చిత్రాల్లో నటించేందుకు ముందుకు వస్తున్నారు. ఇలా ఇటీవలే విడుదలైన చిత్రం 'విరాట పర్వం'. 1990 దశకం నాటి నక్సలైట్ ఉద్యమం సమయంలో జరిగిన నిజ జీవిత సంఘటన ఆధారంగా రూపొందిన ఈ సినిమా రానా - సాయి పల్లవి జంటగా నటించారు. ఎన్నో అంచనాలతో గత వారమే ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, దీనికి టాక్ మంచిగా రాకపోవడంతో కలెక్షన్లు అంతగా రావడం లేదు. ఈ నేపథ్యంలో విరాట పర్వం మూవీ 9 రోజుల బాక్సాఫీస్ రిపోర్టును చూద్దాం పదండి!

స్వచ్చమైన ప్రేమకథతో వచ్చింది
దగ్గుబాటి రానా - సాయి పల్లవి కలయికలో వేణు ఉడుగుల రూపొందించిన స్వచ్చమైన ప్రేమకథా సినిమానే 'విరాట పర్వం'. ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి మ్యూజిక్ డైరెక్టర్. ఇందులో నివేదా పేతురాజ్, ప్రియమణి, నందితాదాస్, నవీన్ చంద్ర, జరీనా వహాబ్, ఈశ్వరీ రావు, బెనర్జీ కీలక పాత్రలను పోషించారు.

అంచనాలకు తగ్గట్లుగా బిజినెస్
యదార్థంగా జరిగిన కథ ఆధారంగా వచ్చిన 'విరాట పర్వం' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ జరిగింది. దీనికి నైజాంలో రూ. 4 కోట్లు, సీడెడ్లో రూ. 2 కోట్లు, ఆంధ్రప్రదేశ్లో రూ. 5 కోట్ల మేర బిజినెస్ జరిగింది. అలాగే, ఓవర్సీస్లో ఈ మూవీకి రూ. 2 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1 కోటి బిజినెస్ జరిగింది. మొత్తంగా దీనికి రూ. 14 కోట్ల మేర బిజినెస్ అయింది.

9వ రోజు ఎక్కడ.. ఎంత వచ్చింది
క్లిష్టమైన నేపథ్యానికి స్వచ్చమైన ప్రేమకథను జోడించి తెరకెక్కించిన 'విరాట పర్వం' చిత్రానికి ఆరంభం నుంచే టాక్తో ఏమాత్రం సంబంధం లేకుండా కలెక్షన్లు వస్తున్నాయి. మొదటి రోజే అనుకున్న స్థాయిలో రాబట్టలేకపోయిన ఈ చిత్రం.. అదే కంటిన్యూ చేస్తూ రోజురోజుకూ పడిపోతూనే ఉంది. ఫలితంగా ఏపీ, తెలంగాణలో ఈ సినిమాకు 9వ రోజు కేవలం రూ. 7 లక్షలే వచ్చాయి.

9 రోజులకు కలిపి ఎంతొచ్చింది?
'విరాట పర్వం' మూవీకి 9 రోజుల్లోనూ తీవ్ర నిరాశే ఎదురైంది. ఫలితంగా నైజాంలో రూ. 1.35 కోట్లు, సీడెడ్లో రూ. 24 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 31 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 19 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 14 లక్షలు, గుంటూరులో రూ. 20 లక్షలు, కృష్ణాలో రూ. 18 లక్షలు, నెల్లూరులో రూ. 9 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 2.70 కోట్లు షేర్, రూ. 4.47 కోట్లు గ్రాస్ మాత్రమే వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది
9 రోజుల్లో ఏపీ, తెలంగాణలో కేవలం రూ. 2.70 కోట్లు షేర్ మాత్రమే రాబట్టిన 'విరాట పర్వం' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ ఎదురుగాలినే ఎదుర్కొంది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 34 లక్షలు, ఓవర్సీస్లో రూ. 1.11 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపి 9 రోజుల్లో దీనికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 4.15 షేర్. రూ. 6.28 కోట్లు గ్రాస్ మాత్రమే వసూలైంది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?
అంచనాలకు అనుగుణంగానే 'విరాట పర్వం' మూవీపై ప్రపంచ వ్యాప్తంగా రూ. 14 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 14.60 కోట్లుగా నమోదైంది. ఇక, 9 రోజుల్లో దీనికి రూ. 4.15 కోట్లు షేర్ వచ్చింది. అంటే మరో 10.35 కోట్లు వస్తేనే ఇది హిట్ అవుతుంది. కానీ, ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే భారీ నష్టాలు వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











