Don't Miss!
- News TTD: శ్రీవారి దర్శనం , సేవలు, వసతి గదుల కోటా విడుదల...!!
- Sports ఛాంపియన్లా వస్తున్నాం.. ఇది ఆరంభం మాత్రమే - పంత్
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
‘పైసా’కలెక్షన్స్ పరిస్దితి ఏంటి?
హైదరాబాద్: ఎంతో కాలంగా విడుదలకు నోచు కోకుండా వాయిదాలు పడుతూ వస్తున్న 'పైసా' చిత్రం ఎట్టకేలకు మొన్న శుక్రవారం రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. నాని హీరోగా, కృష్ణ వంశీ దర్శకత్వంలో రూపొందిన ఈ 'పైసా' మార్నింగ్ షో కే డివైడ్ టాక్ తెచ్చుకుంది. ఓపినింగ్స్ పెద్దగా తెచ్చుకోలేకపోయిన ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద నిలబడటం కష్టమే అని ట్రేడ్ లో అంచనాలు వేస్తున్నారు. శనివారానికే కలెక్షన్స్ చాలా చోట్ల డ్రాప్ అవటం సినిమాకు మైనస్ గా మారింది. ఈ వీకెండ్ ఓకే అనిపించుకున్నా సోమవారం నుంచి కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయన్న అన్నది కీలకంగా నిలవనుంది. ఈ చిత్రాన్ని పుప్పాల రమేష్ ఎల్లోఫ్లవర్స్ బేనర్పై నిర్మించారు. నాని సరసన కేథరీన్ నటించింది.
పాత బస్తీలోని షేర్వాణీ దుకాణంలో మోడల్ ప్ర'క్యాష్' (నాని)కి డబ్బంటే పిచ్చి. ఎలాగైనా కోటీశ్వరుడు అయిపోవాలనుకునే అతన్ని ఓ పేద ముస్లిం అమ్మాయి నూర్జహాన్ (కేథరిన్) ప్రేమిస్తుంది. అయితే డబ్బే ముఖ్యం అనుకునే ప్రకాష్ ఆమెను నిర్లక్ష్యం చేయటంతో ఆమె ఓ ముసలి షేక్ ని వివాహం చేసుకోవానికి సిద్దపడుతుంది. అది తెలిసిన ప్రకాష్ ఆమెను సేవ్ చేసే ప్రాసెస్ లో ఓ వెహికల్ తో పారిపోతాడు. ఆ వెహికల్ లో ఓ మినిస్టర్ (చరణ్ రాజ్) ఎన్నికల కోసం పంపిన హవాలా డబ్బు 50 కోట్లు ఉంటుంది. అక్కడ నుంచి కథ మలుపు తిరిగుతుంది. చివరకు నూర్జహాన్ ప్రేమను ఒప్పుకున్నాడా... ఆ డబ్బు ఏమైంది అనేది మిగతా కథ.
కృష్ణవంశీ మాట్లాడుతూ...పచ్చనోటు అన్వేషణలోనే జీవితం గడిచిపోతోంది. మనిషి ఆశ.. శ్వాస.. పైసానే. అందుకోసమే ఎన్ని ఎత్తులేసినా, ఇంకెన్ని జిమ్మిక్కులు చేసినా. మా హీరో పైసల కోసమే పోరాటం చేశాడు. అది ఎందుకు? దాని వెనుక ఉన్న కారణం ఏమిటి? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే మా సినిమా చూడండి అంటున్నారు.
అలాగే... ''డబ్బు డబ్బు డబ్బు. లేచింది మొదలు ప్రతి ఒక్కరూ పఠించేది మనీ మంత్రమే. పచ్చ నోటు చుట్టూ ప్రదక్షిణలే. వేలు, లక్షలు అనే మాటకి ఇప్పుడు విలువే లేదు. వందల కోట్లు, వేల కోట్లు అంటూ అందరూ సరదాగా మాట్లాడేస్తున్నారు. సంపాదన మోజులో మనుషులమన్న విషయాన్నే మరిచిపోతున్నారు. పచ్చ నోట్ల నీడలో అనుబంధాలు, ఆత్మీయతలు కనుమరుగైపోతున్నాయి. మన జీవనాన్ని, సామాజిక పరిస్థితుల్నీ డబ్బే శాసిస్తోంది. ఈ విషయాన్ని మా చిత్రంలో చూపించాము'' అన్నారు కృష్ణవంశీ.
నిర్మాత మాట్లాడుతూ ''పేరుకు తగ్గట్టుగా పైసా వసూల్ సినిమా ఇది. టిక్కెట్టు రేటుకు తగిన వినోదం గిట్టుబాటు అవుతుంది. కృష్ణవంశీ శైలిలోనే విభిన్నంగా సాగే ఈ సినిమా నాని కెరీర్లో ఓ మైలురాయిగా మిగిలిపోతుందన్న నమ్మకం ఉంది''అన్నారు. సంగీతం: సాయికార్తీక్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రాజారవీంద్ర.