హన్సిక మొత్వని
Born on 09 Aug 1991 (Age 32) ముంబాయి, మహరాష్ట
హన్సిక మొత్వని బయోగ్రఫీ
హన్సికా మోత్వాని భారతీయ నటి. ముంబాయిలో జన్మించింది. ఈమె తండ్రి ప్రదీప్ మోత్వానీ వ్యాపరస్తుడు మరియు తల్లి మోనా మోత్వానీ ప్రసిద్ధి చెందిన చర్మవైద్యురాలు (డెర్మటాలజిస్ట్). వీరిద్దరూ విడాకులు తీసుకొన్నారు. ప్రస్తుతము హన్సిక సంరక్షణా బాధ్యతలను తల్లి మోనా చూసుకొంటున్నది.
హన్సిక చాలా సీరియళ్లలోను, సినిమాల్లోనూ చిన్నతనంలోనే నటించింది. 2001లొ కొన్ని సీరియళ్లలో చైల్డ్ ఆర్టిస్ట్గా చేసింది. పూరీజగన్నాధ్ తీసిన 'దేశముదురు' సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్గా పరిచయమైంది. టాలీవుడ్లో మొదటి సినిమాతోనే హిట్ కొట్టడమే కాకుండా అందరి దృష్టినీ తన వైపుకు సునాయాసంగా మళ్లించుకోగలిగింది.
తర్వాత జూనియర్ ఎన్టీఆర్ పక్కన 'కంత్రీ'లో ఆడిపాడింది. రామ్తో 'మస్కా' చిత్రంలో నటించి మంచి మార్కులు సంపాదించుకుంది. తర్వాత ప్రభాస్ నటించిన 'బిల్లా' సినిమాలో 'ప్రియ'గా గెస్ట్ రోల్లో నటించింది.'జయీభవ'తో కల్యాణ్రామ్తో జతకట్టినా ఆ చిత్రం వూహించిన అంచనాలను చేరుకోలేకపోయింది. తర్వాత నితిన్తో 'సీతారాముల కల్యాణం'లో నటించింది. అది కూడా బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. దాంతోతన దృష్టిని తమిళ పరిశ్రమ వైపు మళ్లించింది.
సంబంధిత వార్తలు