Don't Miss!
- News రఘురామకు సీటు పై కసరత్తు - కీలక ప్రతిపాదన, ఖాయమయ్యేనా..!!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- Finance Insurance Company: ఈ శని, ఆదివారాలు తెరిచి ఉండనున్న బీమా కంపెనీలు..
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
ప్రభాస్ 'మిర్చి' లో అరగంట కట్??
హైదరాబాద్ : ప్రభాస్ హీరోగా రచయిత కొరటాల శివని దర్శకునిగా పరిచయం చేస్తూ యు.వి. క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న భారీ చిత్రం 'మిర్చి'. ఈ చిత్రం పిప్రవరి 8న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ మధ్యనే సెన్సార్ జరుపుకున్న ఈ చిత్రంలో అరగంట సేపు కట్ చేసారనే వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఓ భారీ యాక్షన్ సన్నివేశం ఈ కట్ లో ఉందని టాక్. సెన్సార్ కు వెళ్లేముందు రెండు గంటల నలభై ఐదు నిముషాలు ఉన్న ఈ చిత్రాన్ని ఫైనల్ గా..అరగంట తీసేసి..రెండు గంటల పదిహేను నిముషాలకు కుదించారని టాక్. ఇది నిజమే కాదో తెలియాలంటే రిలీజ్ దాకా ఆగాల్సిందే.
ఈచిత్రం ప్రభాస్ కెరీర్ లోనే అత్యధిక థియేటర్లలో విడుదల కానుంది. వి.వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనుష్క, రిచా గంగోపాధ్యాయ హీరోయిన్లు. ఈ మధ్య కాలంలో మంచి బిజినెస్ జరుపుకున్న చిత్రంగా ఈ చిత్రాన్ని చెప్తున్నారు. ఈ సినిమా గురించి నిర్మాతలు మాట్లాడుతూ 'ఈ సినిమాలో ప్రభాస్ వైవిధ్యమైన పాత్ర పోషించారు. ఆయన లుకింగ్ స్టయిల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. తొలిసారిగా ఆయన కెరీర్లోనే అత్యధిక థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ వ్యయంతో సినిమాని నిర్మించాం. కథ మీద కమాండ్తో హై స్టాండర్డ్ టెక్నికల్ వాల్యూస్తో దర్శకుడు శివ చిత్రాన్ని రూపొందించారు.
గరం గరం మిర్చి తినడానికి ఎంత బాగుంటుందో అలాగే మా 'మిర్చి' సినిమా చూసి జనం అంత ఎంజాయ్ చేస్తారు. దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం సంగీత ప్రియులను అలరిస్తోంది' అని తెలిపారు. సత్యరాజ్, నదియా, బ్రహ్మానందం, రఘుబాబు, 'సత్యం'రాజేష్, శ్రీనివాసరెడ్డి, సంపత్ కుమార్, ఆదిత్యామీనన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అశోక్కుమార్, కథ, మాటలు, స్క్రీన్ప్లే, దర్శకత్వం: కొరటాల శివ.