twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ’9th క్లాస్' కేరాఫ్ ఏలేశ్వరం

    By Staff
    |

    మానస ఆర్ట్స్ పతాకంపై 'అల్లరి పెళ్లికొడుకు' అనే చిత్రాన్ని నిర్మించిన ఎం.రాజ్ కుమార్ తమ సంస్థ ద్వితీయ చిత్రంగా 'నైన్త్ క్లాస్' (కేరాఫ్ ఏలేశ్వరం) అనే కొత్త చిత్రాన్ని ప్రారంభించారు. నూతన తారలైన ప్రణయ్, రిషితలను హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ స్వీయనిర్మాణ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ఆయన తెరకెక్కిస్తున్నారు. ఎ.చంద్రశేఖర్ సమర్పకుడుగా వ్యవహరిస్తున్నారు. అన్నపూర్ణా స్టూడియోస్ లో బుధవారంనాడు ఈ చిత్రం షూటింగ్ మొదలైంది. 9 గంటల 9 నిమిషాల 9 సెకెండ్లకు హీరోహీరోయిన్లపై తీసిన ముహూర్తం సన్నివేశానికి మాజీ మంత్రి డాక్టర్ కె.చంద్రశేఖర్ క్లాప్ ఇచ్చారు. సి.కల్యాణ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, రామకృష్ణ గౌడ్ గౌరవ దర్శకత్వం వహించారు.

    రాజ్ కుమార్ మాట్లాడుతూ, యువతారాగణంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామనీ, ప్రణయ్, రిషితను హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తున్నామనీ చెప్పారు. తొమ్మిదో తరగతి చదివే సమయంలో స్టూడెంట్స్ కు కలిగే ఫీలింగ్స్ ను ఇందులో చూపిస్తున్నామని అన్నారు. అప్పుడే ప్రేమ మొదలైందని కాదనీ, అప్పటి ఫీలింగ్స్ చూపిస్తున్నామనీ, ప్రేమ మొదలయ్యే సరికి సినిమా పూర్తవుతుందనీ చెప్పారు. ఈ చిత్రాన్ని ధవళేశ్వరం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించి వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. ప్రణయ్ మాట్లాడుతూ, తాను హైద్రాబాద్ వాసిననీ, పుణే ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ లో నటనకు సంబంధించిన శిక్షణ తీసుకున్నాననీ చెప్పారు. రిషిత మాట్లాడుతూ, వైజాగ్ లోని సత్యానంద్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో తాను శిక్షణ పొందాననీ, నటిగా ఇది తనకు తొలి చిత్రమనీ చెప్పారు. కథ-స్క్రీన్ ప్లే సైతం ఎం.రాజ్ కుమార్ అందిస్తున్న ఈ చిత్రానికి వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందిస్తున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X