Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
కళ్యాణ్ రామ్ నెక్ట్స్ చిత్రం దర్శకుడు ఖరారు
హైదరాబాద్ : వరస ప్రాజెక్టులతో ఎప్పుడూ బిజీగా ఉండే కళ్యాణ్ రామ్ మరో సినిమా కమిటయ్యారు. పిల్లా నువ్వు లేని జీవితం అంటూ హిట్ కొట్టి ఇప్పుడు గోపిచంద్ తో సౌఖ్యం రూపొందిస్తున్న ఎఎస్ రవికుమార్ చౌదరితో సినిమా ఫైనల్ చేసినట్లు సమాచారం. ఎంటర్నైమెంట్ తో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్ గా చిత్రం రూపొందనుంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించనున్నారని సమాచారం. రీసెంట్ గా వచ్చిన షేర్ చిత్రం నిరాశపరచటంతో ఈ సారి కథ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం.
ఇక రవికుమార్ చౌదరి తాజా చిత్రం విషయానికి వస్తే...
ఆపదలో ఆదుకొనేవాడే ఆప్తుడు. మన సౌఖ్యం కోరుకొనే వాడే స్నేహితుడు. అలా స్నేహితుడిగా వచ్చి, ఆప్తుడిగా మారిన ఓ యువకుడి కథే 'సౌఖ్యం' అంటున్నారు గోపీచంద్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'సౌఖ్యం'. రెజీనా హీరోయిన్. ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకుడు.
వి.ఆనంద్ ప్రసాద్ నిర్మాత. ఇటీవల స్విట్జర్లాండ్లో మూడు పాటల్ని తెరకెక్కించారు. వచ్చే నెల 25న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.
దర్శకుడు మాట్లాడుతూ ''వినోదం, యాక్షన్, కుటుంబ బంధాలతో సాగే చిత్రమిది. రామజోగయ్య శాస్త్రి రాసిన 'ఓనా సిండ్రెల్లా ముద్దొచ్చే ఏంజెల్లా', 'నాకేం తోచదే తోచదే' పాటలతో పాటు భాస్కరభట్ల రచించిన 'ఆ ఇవ్వమ్మ ఇవ్వమ్మ' గీతాన్ని తెరకెక్కించాము''అన్నారు. సంగీతం: అనూప్ రూబెన్స్