Don't Miss!
- Sports SRH playing XI: అతనిపై వేటు..ఢిల్లీతో ఆడే తుదిజట్టు ఇదే
- News జగన్ ను జైల్లో పెట్టావ్.. పుట్టపర్తి సాయిబాబా సంపదంతా దోచుకున్నావ్: తగ్గని మంత్రి పెద్దిరెడ్డి
- Technology Lava ProWatch లావా ప్రోవాచ్ డిజైన్, ధర వివరాలు లీక్.. ఫంక్షన్ కీ సహా కీలక హెల్త్ ట్రాకర్లు..!!
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
అతనికే నా ఓటు.. అల్లు అర్జున్ని ఒప్పించే ప్రయత్నంలో సుకుమార్!
ఇటీవలే అల.. వైకుంఠపురములో సినిమాతో భారీ సక్సెస్ సాధించిన అల్లు అర్జున్.. ప్రస్తుతం తన 20వ ప్రాజెక్టును సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. 'రంగస్థలం' తర్వాత గ్యాప్ తీసుకున్న సుకుమార్ ఈ సినిమా కోసం బలమైన స్క్రిప్ట్ రెడీ చేసి రంగంలోకి దిగారు.
పైగా అల్లు అర్జున్తో తాను చేయబోతున్న మూడో సినిమా కావడంతో హాట్రిక్ సాధించాలని కసితో ఉన్నారు ఈ క్రియేటివ్ డైరెక్టర్. ఈ మేరకు నటీనటులు మొదలుకొని, సాంకేతిక వర్గం వరకు అందరినీ సెలెక్టెడ్ గా ఎంపిక చేస్తున్నారట సుక్కు. అయితే ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో సుకుమార్, అల్లు అర్జున్ ఆలోచనలు వేరు వేరుగా ఉన్నాయని తెలుస్తోంది.
'అల.. వైకుంఠపురములో' మ్యూజిక్ గ్రాండ్ సక్సెస్ చేసిన థమన్ కావాలని అల్లు అర్జున్ భావిస్తుండగా, తనకు ఎన్నో మ్యూజికల్ హిట్స్ అందించిన దేవీ శ్రీ ప్రసాద్ కావాలని సుకుమార్ అనుకుంటున్నారట. ఈ మేరకు ఇద్దరి మధ్య చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. కాగా అల్లు అర్జున్ని ఒప్పించే ప్రయత్నంలో సుకుమార్ ఉన్నట్లుగా టాక్ నడుస్తోంది. సో చూడాలి మరి చివరకు ఏ సంగీత మాంత్రికుడు ఫైనల్ అవుతాడో!.
ఇక ఈ సినిమా ఇతర వివరాలు చూస్తే.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న వైవిద్యభరితమైన కథాంశం అని తెలుస్తోంది.