Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
US లో ఉన్న తెలుగు పిల్లల కోసమే మహేష్
హైదరాబాద్ : మార్కెట్ విస్తరించుకోవాలంటే మనకు ఉన్న అన్ని అవకాశాలను పరిశీలించాలి. అదే ఇప్పుడు ఆగడు నిర్మాతలు చేస్తున్నారు. తమ సినిమాను US లో రెగ్యులర్ గా రిలీజ్ చేసి చేతులు దులుపుకోకుండా అక్కడ ఉండే మన తెలుగు వారి పిల్లలు కేవలం ఇంగ్లీష్ మాత్రమే వచ్చిన వారు కోసం సబ్ టైటిల్స్ వేస్తున్నారని సమాచారం. ఈ ఆలోచన మహేష్ దే అని తెలుస్తోంది. ఆయన ఫ్యాన్స్ గతంలో ఈ విషయాన్ని మహేష్ దృష్టికి తెచ్చినట్లు తెలుస్తోంది. దాంతో అక్కడ సెటిల్ అయిన తెలుగు వారి పిల్లలను దృష్టిలో పెట్టుకుని ఈ ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.
ఈ విషయమై నిర్మాత అనీల్ మాట్లాడుతూ... "US లోని కొన్ని ఎంపిక చేసిన థియోటర్స్ లో ఆగడు చిత్రం సబ్ టైటిల్స్ విడుదల చేయటానికి సన్నాహాలు పూర్తి చేసాం. మన తెలుగువాళ్లంతా మోస్ట్ డిజైర్ బుల్ స్టార్ ని చూడటానికి మీ స్నేహితులను కూడా తీసుకు రావచ్చు ". అన్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 29న విడుదల అవుతోంది.
ఖచ్చితంగా మరో హిట్ తో వస్తామని శ్రీను వైట్ల పూర్తి నమ్మకంగా ఉన్నారు. ఇంతకాలం శ్రీను వైట్లతో కలిసి పని చేసిన గోపీ మోహన్, కోన వెంకట్ సొంతగా దర్శకత్వం వైపు అడుగులు వేయడంతో.... ‘ఆగడు' సినిమాకు సొంతగా స్క్రిప్టు రాసుకుని దిగారు శ్రీను వైట్ల. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బేనర్లో ‘దూకుడు' సినిమా చేసిన మహేష్ బాబు.....అదే బానర్లో సుకుమార్ దర్శకత్వంలో సినిమాకు చేసారు. ఆ సినిమా వెంటనే మళ్లీ ఇదే బేనర్లో శ్రీను వైట్లతో ‘ఆగడు' సినిమా చేయడానికి రెడీ కావడం గమనార్హం.
మహేష్ బాబు మాట్లాడుతూ... ''దూకుడు' సమయంలో తమన్ కెరీర్ ఆరంభంలో ఉంది. ఇప్పుడు 50వ సినిమాగా 'ఆగడు' చేస్తున్నాడు. మేం 50 సినిమాలు చేయాలంటే ఎన్నేళ్లు పడుతుందో? తనకి ఈ చిత్రం ప్రత్యేకం అవుతుంది. మంచి పాటలు అందించాడు. భాస్కరభట్ల, శ్రీమణి సాహిత్యం చాలా బాగుంది. ఛాయాగ్రాహకుడు గుహన్తో నేను చేస్తున్న ఐదో సినిమా ఇది. తను నన్ను తెరపై బాగా చూపిస్తాడు. ప్రేమ్రక్షిత్ ఈ సినిమాలోని అన్ని పాటలకూ నృత్యాలు సమకూర్చారు. ఇలా సాంకేతిక బృందమంతా కలిసి కట్టుగా ఈ సినిమాని పూర్తి చేసింది.
'దూకుడు' అప్పట్లో నా కెరీర్కి ఓ పెద్ద మలుపునిచ్చింది. ఇప్పుడు 'ఆగడు' ఇంకో మలుపు అవుతుంది. శ్రీనువైట్లతో సినిమా చేయడం చాలా హాయిగా ఉంటుంది. ప్రతీ సన్నివేశాన్నీ, ప్రతీ రోజునీ ఆస్వాదిస్తుంటాను. నిర్మాతలు ఈ సినిమాకోసం చాలా కష్టపడ్డారు. వాళ్లతో మళ్లీ మళ్లీ సినిమాలు చేస్తాను. సెప్టెంబరు 19న 'ఆగడు'ని విడుదల చేస్తున్నాం. పండగ రెండు రోజుల ముందే జరుపుకొంటున్నాం''. అన్నారు.
గతంలో
పోకిరి,దూకుడు
చిత్రాలలో
పోలీస్
గా
కనిపించిన
మహేష్
బాబు
మరోసారి
పోలీస్
గా
కనిపించనున్నాడని
తెలుస్తోంది.
శ్రీను
వైట్ల
దర్శకత్వంలో
రూపొందనున్న
చిత్రం
ఆగడు
లో
మహేష్
మరోసారి
పోలీస్
గా
తన
విశ్వరూపం
చూపించనున్నాడని
సమాచారం.
ఎంటర్టైన్మెంట్
తో
పాటు
ఈ
సారి
మరింత
యాక్షన్
ని
పెంచినట్లు
తెలుస్తోంది.
ఎన్టీఆర్
తో
చేసిన
బాద్షా
చిత్రం
యావరేజ్
టాక్
తెచ్చుకోవటంతో
ఈ
సారి
మరో
బ్లాక్
బస్టర్
హిట్
కొట్టాలని
శ్రీను
వైట్ల
ఫిక్సైనట్లు
చెప్తున్నారు.
అందుకు
తగినట్లే
మహేష్
క్యారెక్టర్
ని
టఫ్
పోలీస్
గా
రూపొందించినట్లు
చెప్పుకుంటున్నారు.
సంగీతం:
తమన్,
ఛాయాగ్రహణం:
కె.వి.
గుహన్,
కళ:
ఎ.ఎస్.ప్రకాశ్,
కూర్పు:
ఎం.ఆర్.వర్మ,
ఎగ్జిక్యూటివ్
నిర్మాత:
పరుచూరి
కోటి.