Don't Miss!
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- News ముస్లీం రిజర్వేషన్లపై మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు, మేము వస్తే ఖేల్ కథం !
- Sports IPL 2024: రుతురాజ్ గైక్వాడ్పై అంబటి రాయుడు విమర్శలు.. తప్పుబట్టిన సిక్సర్ల సిద్దు!
- Automobiles మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
షాకింగ్ న్యూస్: రూ. 1000 కోట్ల మహాభారతం నుండి అమీర్ ఖాన్ తప్పుకున్నాడా?
బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్తో రూ. 1000 కోట్ల బడ్జెట్లో మహాభారతం సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. అయితే దీనికి సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. ఈ మెగా ప్రాజెక్ట్ నుండి అమీర్ ఖాన్ తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు నేషనల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
మహాభారతం ప్రాజెక్టను 3 పార్టులుగా తెరకెక్కించాలని అమీర్ ఖాన్ భావించారు. ఇందుకు సంబంధించిన ప్రాసెస్ కూడామొదలైనట్లు కూడా మీడియాలో కొన్ని రోజులుగా చర్చ సాగుతోంది. అయితే తాజా రిపోర్ట్స్ ప్రకారం సినిమాకు అయ్యే భారీ బడ్జెట్, చిత్రీకరణకు తీసుకునే సుధీర్ఘ సమయాన్ని దృష్టిలో పెట్టుకుని అమీర్ ఖాన్ దీని నుండి తప్పుకోవాలనే నిర్ణయం తీసుకున్నారట.
కమర్షియల్గా వర్కౌట్ కాదనే ఉద్దేశ్యమేనా?
మహాభారతం 3 భాగాలుగా తీయాలంటే కనీసం 5 సంవత్సరాల సమయం పడుతుంది. రూ. 1000 కోట్ల బడ్జెట్ కూడా సరిపోక పోవచ్చు. పైగా ఇది కమర్షియల్గా వర్కౌట్ కాక పోవచ్చు అని అమీర్ ఖాన్ భావిస్తున్నారట. ఈ ప్రాజెక్టులోని లాభ నష్టాలను బేరీజు వేసుకున్న అనంతరం దీని నుండి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు తమకు తెలిసిందని.... ఓ ఆంగ్లపత్రిక తన కథనంలో పేర్కొంది. ఇంత రిస్క్ తీసుకునే బదులు 5 సంవత్సరాల్లో 3 ఫీచర్ ఫిల్మ్స్ చేయవచ్చనే ఆలోచనలో అమీర్ ఖాన్ ఉన్నారట.
అంతలోనే ఇలాంటి వార్తలు, అంతా ఆశ్చర్యం
మహాభారతం ప్రాజెక్టును బిజినెస్ టైకూన్ ముఖేష్ అంబానీ నిర్మించబోతున్నారని, రూ. 1000 కోట్లు ఇన్వెస్ట్ చేయడానికి ఆయన ముందుకు రావడంతో ఈ ప్రాజెక్టుపై అమీర్ ఖాన్ ఆల్రెడీ కసరత్తు కూడా ప్రారంభించారని, ఇందులో బాహుబలి ప్రభాస్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు ప్రచారం జరిగింది. అంతలోనే ఇలాంటి వార్తలు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
చైనీస్ ప్రొడక్షన్ కంపెనీ ఆసక్తి
చైనాలో అమీర్ ఖాన్ సినిమాలకు మంచి ట్రాక్ రికార్డ్ ఉండటంతో ఈ భారీ ప్రాజెక్టులో భాగస్వామ్యం అయ్యేందుకు ఓ చైనీస్ ప్రొడక్షన్ కంపెనీ కూడా ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వినిపించాయి. అంతా సవ్యంగా సాగుతుందనుకునే సమయానికి అమీర్ ఖాన్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంటున్నాడనే వార్తలు విస్మయానికి గురి చేస్తున్నాయి.
అమీర్ ఖాన్
ప్రస్తుతం అమీర్ ఖాన్ ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్' అనే పీరియడ్ డ్రామా నేపథ్యంలో సాగు చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కత్రినా కైఫ్, ఫాతిమా సనా షేక్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. స్వాతంత్య్రానికి ముందు జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.