Don't Miss!
- Lifestyle డిఫరెంట్ స్టైల్ లో నోనూరించే మటన్ రోస్ట్
- News Viral Video: రాజకీయ దిగ్గజాల కాళ్లు మొక్కిన టీడీపీ అభ్యర్ధి నిమ్మల..!
- Technology ఆంధ్రప్రదేశ్ లో 7.9 మిలియన్ల 5G యూజర్ లతో, Airtel మరో రికార్డు! 5G విస్తరణ వివరాలు
- Finance Gold Rate: మిసైల్ వేగంతో పెరిగిన పసిడి.. నిన్న పడింది నేడు పుంజుకుంది..
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
నిజమైతే...మెగా ఫ్యాన్స్ కి నిరాశే
హైదరాబాద్ : చిరంజీవి అభిమానులంతా... రేపటి రోజు(ఆగస్టు 22) కోసం ఎదురుచూస్తున్నారు. ఆయన పుట్టిన రోజు సెలబ్రేషన్స్ లో భాగంగా 150 వ చిత్రం ప్రారంభం కానుందని భావిస్తున్నారు. అయితే ఫిల్మ్ సర్క్లిల్స్ లో వినిపిస్తుదాన్ని బట్టి అలాంటిదేమీ జరగటానికి సన్నాహాలు చేయటం లేదు. ఎందుకంటే చిరంజీవి రేపటి రోజున నేపాల్ టూర్ లో ఉంటారు.
నేపాల్ కి ఆయన భార్యతో కలిసి వెళ్లి అక్కడ కొన్ని ప్రత్యేక పూజలు చేయించనున్నారు. అంతేకాకుండా హిమాలయాల్లోని ఓ స్పాలో ఆయన కొద్ది రోజులు గడపనున్నారు. రామ్ చరణ్ మాత్రమే కేవలం చిరంజీవికి సంభందించిన పుట్టిన రోజు సెలబ్రేషన్స్ ని పర్యవేక్షించనున్నారు. ఇదే నిజమే అయితే మెగా ఫ్యాన్స్ కు పెద్ద నిరాశే అన్నది మాత్రం నిజం.
ఇంతకీ చిరు 150వ సినిమాకి రెడీ అవుతున్నారా?
సినిమాల్లో చిరంజీవి పునఃప్రవేశానికి రంగం సిద్ధమైందా? ప్రస్తుతం ఆయన సినిమా ఆలోచనల్లోనే తలమునకలవుతున్నారా? - అవుననే అంటున్నాయి తెలుగు సినిమా వర్గాలు. ఎన్నికల ప్రక్రియ పూర్తవ్వగానే ఆయన తన 150వ సినిమా గురించి పలువురు సినీ ప్రముఖులతో చర్చించినట్టు తెలిసిందే. తనకి కథలు చెప్పడానికి సిద్ధంగా ఉన్న దర్శకుల వివరాలు కూడా అడిగి తెలుసుకొన్నట్టు సమాచారం.
వి.వి.వినాయక్, కృష్ణం వంశీ , పూరి జగన్నాథ్లాంటి దర్శకులు చిరు కోసం కథలు సిద్ధం చేసే పనిలో ఉన్నారట. ఈ చిత్రానికి రామ్చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తారు. అన్నీ అనుకున్నట్టు కుదిరితే... ఆగస్టులో చిరు పుట్టిన రోజున కొత్త సినిమా వివరాల్ని ప్రకటిస్తారని భావించారచు. అయితే కథ ఇంకా సెట్ కాలేదని సమాచారం. చిరంజీవి ..చారిత్రక చిత్రంలో నటించాలా...సోషల్ మెసేజ్ ఉన్న చిత్రంలో నటించాలా లేక కమర్షియల్ ఎంటర్టైనర్ లో నటించాలా అన్నదానిపై మల్లగుల్లాలు పడుతున్నారని చెప్తున్నారు.
అయితే కొంత మెసేజ్ పెట్టుకుని పక్కా మాస్ మసాలా ఎంటర్టైనర్ అయితే బెస్ట్ అని చిరంజీవి ఫిక్స్ అయ్యారని అంటున్నారు. చిరంజీవికి కథ సెట్ అయిన . వెంటనే సినిమాని సెట్స్పైకి తీసుకెళతారు. మొత్తంగా చిరంజీవి మళ్లీ సినిమాల్లో నటించాలని మానసికంగా సిద్ధమయ్యారు...అంతేకాకుండా శారీరకంగానూ ఆయన మళ్లీ గ్లామర్ పెంచే పనిలో పడ్డారు.