Don't Miss!
- Sports IPL చరిత్రలో తొలిసారి.. రాహుల్-రుతురాజ్కు షాక్!
- News Rk Roja Margadarsi Chit: మార్గదర్శిలో రోజాకు చిట్! విలువెంతో తెలుసా?
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- Finance Ola Cabs IPO: త్వరలో ఓలా క్యాబ్స్ ఐపీఓ..
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Technology ధర రూ.14999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా శాంసంగ్ స్మార్ట్ఫోన్ కొత్త వేరియంట్ విడుదల..!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
పెళ్ళై ఆరు నెలలకే నాగార్జున హీరోయిన్ కి విడాకులు
నాగార్జున సరసన క్రిమినల్ చిత్రంలో చేసిన బాలీవుడ్ హీరోయిన్ మనీషా కొయరాలా గుర్తుండే ఉంటుంది. ఆమె వివాహం జరిగి ఆరు నెలలు అవుతోంది. అయితే అప్పుడే ఆమె విడాకుల కావాలంటోంది. క్రితం రాత్రి ఆమె ఈ విషయాన్ని స్వయంగా ఫేస్ బుక్ లో ఉంచి ఆ తర్వాత ఓ గంట సేపటికే తొలిగించింటం హాట్ టాపిక్ గా మారింది. అందులోనూ కొద్ది రోజుల క్రితమే నేపల్ కి హాలిడే ట్రిప్ కి వెళ్ళి అక్కడ ఫొటోలను ఆమె ట్విట్టర్ లో పోస్ట్ కూడా చేసింది. ఇక వీరి వివాహాం విఛ్చిన్నం కావటానికి కారణం మనీషా కొయరాలా ప్రవర్తనే కావచ్చునని అంటున్నారు. ఆమె స్వేఛ్చా జీవి అని వివాహం అనే బంధంలో ఉండటం కష్టమని ఆమె సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారని చెప్తున్నారు. ఇక మనీషా కొయిరాల నేపాల్ వాణిజ్య వేత్త సామ్రాట్ దహాల్ ను వివాహం చేసుకుంది. మనీషా కోయిరాల, సామ్రాట్ దహాల్ ల వివాహం జూన్ 19వ తేదీన జరిగింది. ప్రస్తుతం మనీషా కొయరాల....హన్సిక, ధనుష్ కాంబినేషన్లో రూపొందుతున్న మాప్పిళ్ళై చిత్రం రీమేక్ లో హన్సికకు తల్లిగా నటిస్తోంది. అలాగే నయనతార తల్లిగా ఎలక్ట్రా అనే మళయాళ చిత్రంలో చేస్తోంది.