Don't Miss!
- News నరసాపురం నాదే-రెండ్రోజుల్లో ఎన్డీయే అభ్యర్ధిగా ప్రకటన-రఘురామ కామెంట్స్..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
అడవి సాయికిరణ్ దర్శకత్వంలో నాగచైతన్య?
వినాయకుడు చిత్రం రూపొందించిన అడవి సాయికిరణ్ తొలి చిత్రంతోనే ప్రతిభ ఉన్న దర్శకుడుగా నిరూపించుకున్నాడు. తర్వాత రిలీజైన విలేజ్ లో వినాయుకుడు సోసోగా నడిచినా తక్కువ బడ్జెట్ తో టేబుల్ ప్రాఫిట్ తెచ్చుకున్న దర్శకుడుగా పేరు తెచ్చుకున్నాడు. మరి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు అన్న దానికి ఫిల్మ్ సర్కిల్స్ లో సమాధానం వినపడుతోంది. అడవి సాయి కిరణ్ తాను తయారు చేసుకున్న ఓ రొమాంటిక్ కామిడీకి సంభందించిన లైన్ నాగచైతన్యకు వినిపించటంతో కథ వింటానని చెప్పటంతో బౌండ్ స్క్రిప్టుకోసం బిజీగా ఉన్నారని తెలుస్తోంది. ఇక వినాయకుడు రిలీజ్ తర్వాత సాయి కిరణ్ కి పెద్ద సంస్ధలనుంచే ఆఫర్స్ వచ్చాయని తెలిసింది. ఇక నాగచైతన్య రెండో చిత్రం ఏ మాయ చేసావే కమర్షియల్ గా విజయం సాధించటంతో మంచి ఉషారుగా ఉన్నాడు. నెక్ట్స్ చిత్రాన్ని అజయ్ భుయాన్ దర్శకత్వంలో చేస్తున్నారు. డి.శివప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. అజయ్ భుయాన్ ఇంతకు ముందు హౌస్ ఫుల్ అనే చిత్రం రూపొందించారు. ఆ చిత్రం ఎవరూ కొనక ఇంకా రిలీజ్ కాలేదు.