Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్ తర్వాత.. మరో స్టార్ హీరోను పట్టేసిన బికినీ భామ
Recommended Video
ఒక లైలా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది పూజా హెగ్డే. ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం కానప్పటికీ ఈ హీరోయిన్ ముకుందా, డిజే సినిమాల్లో నటించింది. తాజాగా ఈ హీరోయిన్ బెల్లంకొండ శ్రీనివాస్ తో శ్రీవాసు దర్శకత్వం వహిస్తోన్న సాక్ష్యం సినిమాలో నటిస్తోంది. తాజాగా ఈ హీరోయిన్ మరో బాలీవుడ్ సినిమా చెయ్యబోతోంది.
బెల్లంకొండ సినిమా చేస్తోంది
నాగ చైతన్య నటించిన ఒక లైలా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది పూజా హెగ్డే. ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం కానప్పటికీ ఈ హీరోయిన్ ముకుందా, డిజే సినిమాల్లో నటించింది. తాజాగా ఈ హీరోయిన్ బెల్లంకొండ శ్రీనివాస్ తో శ్రీవాసు దర్శకత్వం వహిస్తోన్న సాక్ష్యం సినిమాలో నటిస్తోంది. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది.
ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్ మూవీస్
ప్రస్తుతం పూజా హెగ్డే మహేష్, వంశి పైడిపల్లి సినిమా తో పాటు ప్రభాస్, రాదాకృష్ణ సినిమా అలాగే ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా చేస్తోంది. మధ్యకాలంలో ఒకేసారి ముగ్గురు అగ్రహీరోల చిత్రాల్లో నటించే అవకాశం దక్కించుకున్న హీరోయిన్ పూజా హెగ్డే అని చెప్పవచ్చు.
బాలివుడ్ లో చేస్తోంది
ఈ హీరోయిన్ గతంలో మొహంజొదారో చిత్రంతో బాలీవుడ్ హృతిక్ రోషన్ తో కలిసి నటించింది కాని ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. తాజాగా ఈ హీరోయిన్ కు మరొక బాలీవుడ్ ఆఫర్ వచ్చిందని సమాచారం. సాజిద్ నడియాద్వాల నిర్మాతగా, సాజిద్ ఖాన్ దర్శకత్వంలో అక్షయ్ కుమార్, బాబీ డియోల్ హీరోలుగా రూపొందించబడుతున్న హౌస్ ఫుల్ 4 చిత్రంలో పూజ హెగ్డే నటించబోతోందని సమాచారం.
మరిన్ని సినిమాల్లో చేస్తోంది
తెలుగులో ముగ్గురు టాప్ హీరోలతో నటించబోతున్న ఈ హీరోయిన్ మరోసారి బాలీవుడ్ సినిమాలో నటించబోతుండడం విశేషం. ఈ హీరోయిన్ ఎన్టీఆర్ తో చెయ్యబోయే సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది. ప్రభాస్ సినిమా జులై నుండి స్టార్ట్ కాబోతోంది. మహేశ్ బాబు సినిమా వచ్చే నెల నుండి మొదలుకాబోతోంది. వరుస సినిమాలతో బిజీ అయిన ఈ హీరోయిన్ మరిన్ని సినిమాల్లో నటించబోతోందో చూడాలి.