Don't Miss!
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- News పొన్నూరు వైసీపీ అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఈసీ ఆదేశం
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఆసుపత్రిలో కోలుకుంటున్న నిన్నటి మెగాస్టార్(ఫోటో)
ముంబై: బాలీవుడ్ నిన్నటితరం మెగాస్టార్ దిలీప్ కుమార్ ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. 90 ఏళ్ల ఈ లెజండరీ నటుడు సెప్టెంబర్ 15న తేలికపాటి గుండె పోటుతో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన్ను వైద్యులు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంచి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
దీలీప్ కుమార్ భార్య సరీరా భాను చెప్పిన వివరాల ప్రకారం...ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని, త్వరలోనే ఆసుపత్రి నుంచి డిచ్చార్జ్ చేస్తారని తెలుస్తోంది. కాగా ఆయన మరణించారనే వందంతులు వ్యాపించడంతో అభిమానులు ఖంగుతిన్నారు. అయితే ఈ విషయమై దిలీప్ సన్నిహితులు వెంటనే స్పందించారు. ఆయన క్షేమంగా ఉన్నారని, వదంతులు నమ్మ వద్దని మీడియా ప్రకటన చేసారు.
దిలీప్ కుమార్కు 14 ఏళ్ల క్రితం హార్ట్ సర్జరీ జరిగింది. ఈ క్రమంలో వయసు పై బడటంతో ఇపుడు మళ్లీ సమస్య ఏర్పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన్ను ఐసియూలో ఉంచి ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షిస్తుంది. కాస్త కోలుకున్న తర్వాత డిచ్చార్జి చేసి ఇంటికి పంపే అవకాశం ఉంది.
బాలీవుడ్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్లలలో దిలీప్ కుమార్ ఒకరు. ఆయన సినిమాలంటే అప్పట్లో మహా క్రేజ్. దీలీప్ కుమార్ను ట్రాజెడీ కింగ్ అని కూడా అంటుంటారు. దిలీప్ నటించిన జోగన్(1950), దీదార్(1951), దాగ్(1952), దేవ్దాస్(1955), యాహుది(1958), మధుమతి(1958) చిత్రాలు అప్పట్లో భారీ విజయం సాధించాయి.