Don't Miss!
- News రిజర్వేషన్లు రద్దు చేస్తారు: మోడీ, కేసీఆర్పై రేవంత్ సంచలన ఆరోపణలు
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
విలన్గా ఐశ్వర్యరాయ్... సెన్సేషనల్ డైరెక్టర్ కోసం హిస్టారికల్ మూవీకి గ్రీన్ సిగ్నల్!
Recommended Video
దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఐశ్వర్యరాయ్ ఓ ఊపు ఊపేసింది. ప్రియురాలు పిలిచింది, జీన్స్ తదితర చిత్రాల్లో తన అందం, అభినయంతో ప్రేక్షకులను మెప్పించింది. బాలీవుడ్లో బిజీ కావడంతో దక్షిణాది వైపు చూడలేకపోయింది. అయితే సంచలన దర్శకుడు మణిరత్నం దర్శకత్వం వహించే పొన్నియన్ సెల్వన్ చిత్రంతో ఐశ్వర్యరాయ్ మరోసారి సౌత్లో మెరువనున్నది. అయితే ఐశ్వర్యరాయ్కి సంబంధించిన పాత్ర గురించి తమిళ చిత్ర పరిశ్రమలో చర్చ జరుగుతున్నది. అదేమిటంటే..
హిస్టారికల్ నవల ఆధారంగా
పొన్నియిన్ సెల్వన్ చిత్రం ప్రముఖ తమిళ రచయిత అమరార్ కల్కి రాసిన గొప్ప నవల. ఈ కథ రాజా రాజ చోళ కాలం నాటిది. 2016 నుంచి ఈ సినిమాను తెరకెక్కించాలని ప్రయత్నం చేస్తున్నాడు. మణిరత్నంకు ఇది డ్రీమ్ ప్రాజెక్ట్. ఈ సినిమాలో మహేష్బాబును హీరోగా పెట్టి తీయాలని ప్లాన్ చేశారు. కానీ ఎందు వలనో ఈ సినిమా ముందుకెళ్లలేకపోయింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతున్నది.
ఐశ్వర్యరాయ్ గ్రీన్ సిగ్నల్
పొన్నియన్ సెల్వన్ చిత్రం కోసం క్రేజీ తారలను మణిరత్నం రంగంలోకి దించుతున్నారు. ఇద్దరు, గురు, రావణ్ చిత్రాల కోసం మణిరత్నం, ఐశ్వర్యరాయ్ కలిసి పనిచేశారు. మళ్లీ ఈ సినిమా కోసం ఐశ్వర్యను తీసుకొన్నట్టు సమాచారం. ఈ సినిమాలో ఐశ్వర్యరాయ్ది విలన్ పాత్ర అని తెలిసింది. ఈ చిత్రంలో నందిని అనే పాత్రలో కనిపిస్తారని సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
ఐశ్వర్యతో అఫైర్: సల్మాన్ చంపుతానని బెదిరించాడు.. నాపై ఫత్వా.. ఆఫర్లు లేకుండా చేశారు.. వివేక్ ఒబేరాయ్
అధికారమే జీవితంగా బతికే
చోళుల సామ్రాజ్యంలో కోశాధికారిగా పనిచేసిన పెరియ పజువెట్టరైయార్ భార్యగా ఐశ్వర్య కనిపిస్తారట. ఈ చారిత్రాత్మక చిత్రంలో అధికారం కోసం అర్రులు చాచే మహిళగా ఓ పవర్ఫుల్ పాత్రను పోషించడానికి ఐశ్వర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. చోళ సామ్రాజ్యం పతనం కోసం కంటి మీద కునుకు లేకుండా శ్రమించే విలన్ పాత్రను సవాల్గా స్వీకరించినట్టు తెలుస్తున్నది. తన భర్తతో కలిసి కుయుక్తులు పన్నే కుటిల యువతిగా కొత్త కోణంలో కనిపిస్తారట.
మరోసారి ప్రతిభను నిరూపించుకొనే
పొన్నియన్ సెల్వన్ చిత్రంలో ఐశ్వర్యరాయ్కి తన ప్రతిభను మరోసారి నిరూపించుకొనే పాత్ర దొరికిందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇప్పటికే నటీనటులు ఎంపిక పూర్తయిందని, త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని చిత్ర యూనిట్ వెల్లడిస్తున్నది. ఈ చిత్రంలో జయం రవి, విక్రమ్, అమితాబ్ బచ్చన్, అమలా పాల్, మోహన్ బాబు కీలక పాత్రల్లో కనిపిస్తారు.