twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ బాబు సినిమాతో ఐశ్వర్యరాయ్ రీఎంట్రీ?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: భారతదేశపు అందాల సుందరి, స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ బిడ్డకు జన్మనిచ్చినప్పటి నుండి సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న సంగతి తెలిసిందే. ఆమె మళ్లీ సినిమాల్లోకి ఎప్పడు రీ ఎంట్రీ ఇస్తుందో అని అభిమానులు కళ్లలో వొత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తున్నారు.

    తాజాగా ఐశ్వర్యరాయ్ రీ ఎంట్రీకి సంబంధించి ఓ ఆసక్తికర వార్త వినిపిస్తోంది. త్వరలో ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించబోయే చిత్రంలో ఆమె నటించనుందని వార్తలు వినిపిస్తున్నారు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఇది నాగార్జున, మహేష్ బాబు, మరికొందరు తమిళ స్టార్లు నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ. అయితే ఆమె ఎవరి సరసన నటిస్తుంది? అనేది తెలియాల్సి ఉంది.

    Aishwarya Rai comeback film with Mahesh Babu?

    గతంలో ఐశ్యర్యరాయ్ ఈ ఎంట్రీ గురించి చాలా వార్తలు వెలువడ్డాయి. అందులో ఏ ఒక్కటి కూడా ఆచరణకు నోచుకోలేదు. మరి ఈ సారైనా ఐశ్వర్యరాయ్ రీ ఎంట్రీ ఇస్తుందా? లేదా? అనేది చూడాలి. ఏది ఏమైనా ఆమె అందాలను వెండితెరపై చూసేందుకు అభిమానులు ఉబలాట పడుతున్నారనేది వాస్తవం.

    కాగా....ఈ చిత్రాన్ని సౌతిండియా రేంజిలో తమిళం, తెలుగు భాషల్లో గ్రాండ్ గా తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారట మెగా దర్శకుడు మణిరత్నం. ఒకప్పుడు తన సినిమాలతో ఆలిండియా ప్రేక్షకులను అలరించిన మణిరత్నం...ఈ మధ్య ప్రేక్షకులను మెప్పించడంలో విఫలం అవుతున్నాడు. మరి ఈసారి ఆయన ఎలాంటి కథతో వస్తారో చూడాలి.

    English summary
    Bollywood diva Aishwarya Rai Bachchan who was away from acting over the past few years is looking to make her comeback with Manirathnam’s upcoming project. Sources have reported that this film is going to be a multi starrer with Nagarjuna & Mahesh Babu acting in it.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X