Don't Miss!
- Sports T20 వరల్డ్ కప్కు భారత తుదిజట్టు ఇదే - సెహ్వాగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- News రాజీనామాకు సిద్దం - కోమటిరెడ్డి వెంకటరెడ్డి..!!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
మహేష్ బాబు సినిమాతో ఐశ్వర్యరాయ్ రీఎంట్రీ?
హైదరాబాద్: భారతదేశపు అందాల సుందరి, స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ బిడ్డకు జన్మనిచ్చినప్పటి నుండి సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న సంగతి తెలిసిందే. ఆమె మళ్లీ సినిమాల్లోకి ఎప్పడు రీ ఎంట్రీ ఇస్తుందో అని అభిమానులు కళ్లలో వొత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తున్నారు.
తాజాగా ఐశ్వర్యరాయ్ రీ ఎంట్రీకి సంబంధించి ఓ ఆసక్తికర వార్త వినిపిస్తోంది. త్వరలో ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించబోయే చిత్రంలో ఆమె నటించనుందని వార్తలు వినిపిస్తున్నారు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఇది నాగార్జున, మహేష్ బాబు, మరికొందరు తమిళ స్టార్లు నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ. అయితే ఆమె ఎవరి సరసన నటిస్తుంది? అనేది తెలియాల్సి ఉంది.
గతంలో ఐశ్యర్యరాయ్ ఈ ఎంట్రీ గురించి చాలా వార్తలు వెలువడ్డాయి. అందులో ఏ ఒక్కటి కూడా ఆచరణకు నోచుకోలేదు. మరి ఈ సారైనా ఐశ్వర్యరాయ్ రీ ఎంట్రీ ఇస్తుందా? లేదా? అనేది చూడాలి. ఏది ఏమైనా ఆమె అందాలను వెండితెరపై చూసేందుకు అభిమానులు ఉబలాట పడుతున్నారనేది వాస్తవం.
కాగా....ఈ చిత్రాన్ని సౌతిండియా రేంజిలో తమిళం, తెలుగు భాషల్లో గ్రాండ్ గా తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారట మెగా దర్శకుడు మణిరత్నం. ఒకప్పుడు తన సినిమాలతో ఆలిండియా ప్రేక్షకులను అలరించిన మణిరత్నం...ఈ మధ్య ప్రేక్షకులను మెప్పించడంలో విఫలం అవుతున్నాడు. మరి ఈసారి ఆయన ఎలాంటి కథతో వస్తారో చూడాలి.