Don't Miss!
- News మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేలా మరింత ఉధృతంగా వైఎస్ జగన్ చివరి విడత ప్రచారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఆ రీమేక్ లో చేయాలని అఖిల్ నిర్ణయం
హైదరాబాద్ : అక్కినేని వారసుడు అఖిల్ తన తొలి చిత్రం అఖిల్ డిజాస్టర్ అయ్యింది. దాంతో ఆయన తన తదుపరి చిత్రం విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా రకరకాల కథలు విన్నా ఏదీ నచ్చటం లేదని సమాచారం. ఈ నేపధ్యంలో ఆయన ఓ హిందీ రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. రీమేక్ అయితే సేఫ్ జోన్ లో హిట్ కొట్టవచ్చనే ఈ నిర్ణయానికి వచ్చాడంటున్నారు.
ఆ రీమేక్ కోసం ఎంచుకున్న చిత్రం మరేదో కాదు... రెండేళ్ల కిందట బాలీవుడ్లో హిట్ కొట్టిన 'యే జవానీ హై దివానీ' అని తెలుస్తోంది. ఈ సినిమా చాలా కాలం క్రితమే చూసినా అప్పట్లో తనకు బాగా నచ్చిందని, ఆ రీమేక్ తో నే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వమని ఆయన ఫ్రెండ్స్ అన్నారని,అయితే అది పట్టించుకోని అఖిల్ ఇప్పుడు అదే నిర్ణయం తీసుకుని హిట్ కొట్టబోతున్నట్లు చెప్తున్నారు.
ధర్మా ప్రొడక్షన్స్- అన్నపూర్ణ స్టూడియోస్ దీన్ని కంబైన్డ్గా తెరకెక్కించాలని ప్లాన్ చేసినట్లు చెప్పుకుంటున్నారు. కరుణ్ జోహార్ సైతం ఈ ప్రాజెక్టుపై చాలా ఆసక్తి చూపెండుతున్నట్లు చెప్పుకుంటున్నారు. ఈ సినిమాని వంశీపైడిపల్లి డైరెక్ట్ చేసే ఛాన్స్ వుంది. ప్రస్తుతం వంశీ పైడిపల్లి..నాగార్జున తో ఊపిరి చిత్రం చేస్తున్నారు. ఆ చిత్రం కూడా ప్రెంచ్ చిత్రం రీమేక్ కావటంతో నాగ్..ఈ నిర్ణయానికి వచ్చాడని చెప్తున్న్రారు.