Don't Miss!
- News పవన్ కళ్యాణ్ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
అఖిల్కు జోడీ కుదిరింది.. ఊపిరి పీల్చుకుంటున్న ఫ్యాన్స్
ఒకవైపు హీరోలందరూ వరుస సినిమాలతో దూసుకుపోతుంటే అక్కినేని వారి వారసుడు అఖిల్ మాత్రం నెమ్మదిగా వెళ్తున్నాడు. దీనికి కారణం ఆయన నటించిన మూడు సినిమాలూ హిట్ కాకపోవడమే. 'అఖిల్', 'హలో', 'మిస్టర్ మజ్నూ' అనే సినిమాలతో వచ్చిన ఈ యంగ్ హీరోకి ఒక్కటంటే ఒక్క హిట్ కూడా దక్కలేదు. ఆకట్టుకునే అందం.. ఫిజిక్.. నటన ఉన్నా.. కథల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో అతడు చేసిన మూడు ప్రయత్నాలూ విఫలం అయ్యాయి. దీంతో ఈ సారి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
ప్రస్తుతం అఖిల్.. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్పై బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉన్నా అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. కానీ, ఇటీవల ఈ సినిమా షూటింగ్ అధికారికంగా ప్రారంభమైంది. అంతేకాదు, సెట్స్లో అఖిల్ ఫొటోలు కూడా లీక్ అయ్యాయి. దీంతో సినిమా పట్టాలెక్కేసిందని క్లారిటీ వచ్చేసింది. ఇక పోతే ఈ సినిమాలో నటించే హీరోయిన్ విషయం మాత్రం తేలలేదు.
వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాకపోవడానికి హీరోయిన్ ఎంపిక జరగకపోవడమే కారణం అని గతంలో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఈ సినిమాలో అఖిల్ సరసన కియారా అద్వానీని తీసుకుంటున్నారని, కాదు కాదు.. రష్మిక మందన్నాను ఓకే చేశారని ప్రచారం జరిగింది. కానీ, వీళ్లెవరినీ ప్రకటించకుండానే చిత్ర షూటింగ్ ప్రారంభించేశారు. ముందు అఖిల్కు సంబంధించిన సన్నివేశాలను తీసి, హీరోయిన్ ఫైలన్ అయిన తర్వాత కాంబినేషన్ సీన్స్ తెరకెక్కించాలన్న ఉద్దేశ్యంతోనే ఇలా చేశారని టాక్ వినిపించింది.
తాజాగా ఈ సినిమాలో నటించబోయే హీరోయిన్ విషయంలో క్లారిటీ వచ్చేసింది. ఆమె మరెవరో కాదు.. నేచురల్ స్టార్ నాని 'గ్యాంగ్ లీడర్'లో నటిస్తోన్న ప్రియాంక అరుల్ మోహన్. అవును.. అఖిల్తో నటించడానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని ఓ వార్త ఫిలింనగర్ వర్గాల్లో ఓ వార్త హల్చల్ చేస్తోంది. కోలీవుడ్కు చెందిన ఈ హీరోయిన్ శర్వానంద్ కొత్త సినిమాలోనూ అవకాశం దక్కించుకుందని ఆ మధ్య వార్తలు బయటకు వచ్చాయి.