Don't Miss!
- News నా తల్లి మంగళసూత్రమిస్తే, అమ్మమ్మ బంగారమిచ్చింది-మోడీకి ప్రియాంక ఘాటు కౌంటర్..!
- Finance Stock Market: యూఎస్ మార్కెట్ల దారిలో ఇండియన్ మార్కెట్లు.. లాభాల్లోనే ప్రయాణం..
- Sports Sachin Tendulkar: కన్నీటిని ఆపుకుంటూ సెంచరీ!
- Technology జియో సినిమా యాప్లో IPL మ్యాచ్లను ఉచితంగా చూస్తున్నారా.. రేపు కీలక ప్రకటన??
- Automobiles క్రాష్ టెస్ట్లో హోండా అమేజ్కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
అఖిల్ కోసం మరో స్టార్ హీరోయిన్.. ఆ బిగ్ బడ్జెట్ ప్రాజెక్ట్ ఎంత వరకు వచ్చిందంటే..
అక్కినేని యువ హీరో అఖిల్ మొదటి సక్సెస్ కోసం ఎంతగా తపన పడుతున్నాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మొదటి మూడు సినిమాలు అనుకున్నంత రేంజ్ లో అయితే సక్సెస్ కాలేదు. ఇక తన ఆశలన్నీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాపైనే పెట్టుకున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు.
అసలు విషయంలోకి వస్తే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ ఒక యాక్షన్ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఇటీవల అఫీషియల్ ఎనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. అయితే హీరోయిన్స్ విషయంలో అఖిల్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఇంతవరకు బాక్సాఫీస్ హిట్ లేకపోయినప్పటికీ పూజా హెగ్డేతో రొమాన్స్ చేయడానికి సిద్ధమయ్యాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో పూజ రోల్ గ్లామరస్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
ఇక సురేందర్ రెడ్డి సినిమాలో కూడా మరో అగ్ర హీరోయిన్ నటించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం లీడింగ్ లో ఉన్న రష్మీక మందన్న అఖిల్ సరసన నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ అయితే వస్తోంది.
హీరోలకు వరుస బాక్సాఫీస్ హిట్స్ అందిస్తున్న రష్మీక అఖిల్ కెరీర్ కు కూడా అలాంటి హిట్ అందిస్తుందో లేదో చూడాలి మరి. ఇక సురేందర్ రెడ్డి సైరా తరువాత అఖిల్ తో చేస్తున్న సినిమా కావున అంచనాలు అయితే భారీగానే ఉన్నాయి. అందుకే సినిమాను కూడా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లు సమాచారం.