Don't Miss!
- News వీళ్లా..వైఎస్ వారసులు, పక్కన పెట్టింది ఇందుకే - షర్మిల పై జగన్ ఫైర్..!!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మరోసారి నిర్మాతగా నితిన్.. అక్కినేని వారసుడి డేరింగ్ స్టెప్!
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో మంచి జోష్లో ఉన్నాడు. భీష్మ సినిమాతో 2020కి కిక్ స్టార్ట్ ఇచ్చిన ఆయన.. ఓ వైపు పెళ్లి పనుల్లో బిజీగా ఉంటూనే వరుస సినిమాలకు కమిట్ అవుతున్నాడు. హీరోగా ఈ ఏడాది పొడవునా సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. ఈ తరుణంలో నితిన్కి సంబంధించిన మరోవార్త ఆయన అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది.
నితిన్ మరోసారి నిర్మాతగా మారబోతున్నాడని న్యూస్ వైరల్ అవుతోంది. అది కూడా అక్కినేని అఖిల్ తో సినిమా రూపొందించనున్నాడని తెలుస్తోంది. అఖిల్ కెరీర్లో తెరకెక్కబోయే ఐదవ సినిమాకు నితిన్ నిర్మాతగా వ్యవహరించనున్నాడట. గతంలో అఖిల్ తొలి సినిమా నిర్మించి నష్టపోయిన నితిన్.. ఈ సారి ఆ నష్టాన్ని పూడ్చేస్తూ హిట్ కొట్టేయాలని భావిస్తున్నాడట.
సురేందర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరించనున్నాడని అంటున్నారు. బడ్జెట్ పరంగా వెనకాడకుండా ఈ సినిమా నిర్మించే ఆలోచనలో నితిన్ ఉన్నాడని తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా కోసం అఖిల్ కూడా ఎలాంటి పారితోషికం తీసుకోకుండా నటించాలని ఫిక్స్ అయినట్లు ఇన్సైడ్ టాక్. అన్నీ అనుకున్నట్లే జరిగితే అతి త్వరలోనే ఈ మూవీ ఆఫీసియల్ అనౌన్స్మెంట్ రావొచ్చని తెలుస్తోంది.
మరోవైపు అఖిల్ ప్రస్తుతం తన నాలుగో సినిమా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్'తో బిజీగా ఉన్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ త్వరలో విడుదల కానుంది.