Don't Miss!
- News ఎమ్మెల్యే రాజా సింగ్ పై కేసు నమోదు
- Sports PBKS vs MI: రోహిత్ శర్మ ట్రేడ్ మార్క్ సిక్సర్.. హార్దిక్ రియాక్షన్ వైరల్! వీడియో
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మరోసారి నిర్మాతగా నితిన్.. అక్కినేని వారసుడి డేరింగ్ స్టెప్!
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో మంచి జోష్లో ఉన్నాడు. భీష్మ సినిమాతో 2020కి కిక్ స్టార్ట్ ఇచ్చిన ఆయన.. ఓ వైపు పెళ్లి పనుల్లో బిజీగా ఉంటూనే వరుస సినిమాలకు కమిట్ అవుతున్నాడు. హీరోగా ఈ ఏడాది పొడవునా సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. ఈ తరుణంలో నితిన్కి సంబంధించిన మరోవార్త ఆయన అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది.
నితిన్ మరోసారి నిర్మాతగా మారబోతున్నాడని న్యూస్ వైరల్ అవుతోంది. అది కూడా అక్కినేని అఖిల్ తో సినిమా రూపొందించనున్నాడని తెలుస్తోంది. అఖిల్ కెరీర్లో తెరకెక్కబోయే ఐదవ సినిమాకు నితిన్ నిర్మాతగా వ్యవహరించనున్నాడట. గతంలో అఖిల్ తొలి సినిమా నిర్మించి నష్టపోయిన నితిన్.. ఈ సారి ఆ నష్టాన్ని పూడ్చేస్తూ హిట్ కొట్టేయాలని భావిస్తున్నాడట.
సురేందర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరించనున్నాడని అంటున్నారు. బడ్జెట్ పరంగా వెనకాడకుండా ఈ సినిమా నిర్మించే ఆలోచనలో నితిన్ ఉన్నాడని తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా కోసం అఖిల్ కూడా ఎలాంటి పారితోషికం తీసుకోకుండా నటించాలని ఫిక్స్ అయినట్లు ఇన్సైడ్ టాక్. అన్నీ అనుకున్నట్లే జరిగితే అతి త్వరలోనే ఈ మూవీ ఆఫీసియల్ అనౌన్స్మెంట్ రావొచ్చని తెలుస్తోంది.
మరోవైపు అఖిల్ ప్రస్తుతం తన నాలుగో సినిమా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్'తో బిజీగా ఉన్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ త్వరలో విడుదల కానుంది.