Don't Miss!
- News వైసీపీ అభ్యర్థికి జగన్ బంపర్ ఆఫర్.. పులివెందుల నుంచి పోటీ చేయలంటూ సూచన
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Sports సూపర్ సండే: సునామీ సన్రైజర్స్ను ఢీకొట్టేదెవరు: నెక్స్ట్ మ్యాచ్ డీటెయిల్స్ ఇవే
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
అమీర్ ఖాన్తో పోటీ పడుతున్న రాజమౌళి స్టోరీ
రవితేజ-అనుష్క జంటగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'విక్రమార్కుడు' తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అప్పట్లో ఈ చిత్రం భారీ విజయం సాధించింది. ఈ సినియాలో రవితేజా ద్విపాత్రాభినయం చేశారు. ఈ రెండు పాత్రల్ని వైవిధ్యభరితంగా మలిచి, అటు యాక్షన్ సీన్లను ... ఇటు కామెడి - సెంటిమెంట్ సన్నివేశాల్ని రాజమౌళి అద్భుతంగా ఆవిష్కరించాడు.
తాజాగా విక్రమార్కుడు సినిమా...హిందీలో 'రౌడీ రాథోర్' గా రీమేక్ చేస్తున్న. హీఅక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సంజయ్ లీలాబన్సాలి నిర్మిస్తుండగా, ఈ సినిమాకి ప్రభుదేవా దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. జూన్ 15 న ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
రౌడీ రాథోర్ సినిమా విడుదలకు ముందు బిజినెస్ చేస్తోంది. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ రూ. 35 కోట్లు పలికాయని బాలీవుడ్ సమాచారం. అమీర్ ఖాన్ హీరోగా చేసిన 'తలాష్'చిత్రం శాటిలైట్ రైట్స్ తో ఈ సినిమా పోటీ పడటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కొన్ని రోజుల క్రితం సల్మాన్ నటించబోయే దబాంగ్2 చిత్రం విడుదలకు ముందే శాటిలైట్ రైట్స్ అత్యధికంగా రూ. 50 కోట్లు అమ్ముడయ్యాయి. ఇప్పుడు రౌడీ రాథోడ్ సినిమా దానికి చేరువడం గమనార్హం.
ప్రస్తుతం రాజమౌళి తెలుగులో 'ఈగ' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. భారీ సాంకేతిక విలువలతో రూపొందుతోన్న ఈ చిత్రం విజువల్ వండర్గా నిలవబోతోందని అంటున్నారు. తెలుగు, తమిళంలో ఒకేసారి ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.