Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
'అల వైకుంఠపురములో' ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఆ రోజే ఫిక్స్!
త్రివిక్రమ్ శ్రీనివాస్- అల్లు అర్జున్ క్రేజీ కాంబోలో రూపొందిన 'అల వైకుంఠపురములో' మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భారీ అంచనాల నడుమ జనవరి 12న విడుదల కానున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈ మేరకు ఇప్పటికే విడుదలైన ఈ సినిమా అప్డేట్స్ భారీ హైప్ క్రియేట్ చేశాయి.
ఈ నేపథ్యంలో చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా చేయాలని ఫిక్స్ అయిందట చిత్రయూనిట్. ఈ మేరకు జనవరి 6వ తేదీని ఫైనల్ చేసినట్లుగా తెలుస్తోంది. పలువురు సినీ ప్రముఖులు, అశేష అభిమానుల సమక్షంలో హైదరాబాదులోనే ఈ వేడుకను నిర్వహించాలని డిసైడ్ అయ్యారట. అంతేకాదు ఈ వేడుకకు ఓ సర్ప్రైజింగ్ గెస్ట్ను కూడా ఆహ్వానించారట. మరో రెండు మూడు రోజుల్లో వేదిక వివరాలు, గెస్ట్ పేరు ప్రకటించనున్నారని తెలుస్తోంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ''సామజవరాగమన, రాములో రాములా'' పాటలు రికార్డుల సునామీ సృష్టిస్తూ 'అల.. వైకుంఠపురములో' స్థాయిని తెలియజేశాయి. థమన్ అందించిన బాణీలకు ఫిదా అయింది ప్రేక్షకలోకం. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుండగా.. సీనియర్ హీరోయిన్ టబు కీలక పాత్ర పోషిస్తోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్, హారిక & హాసిని క్రియేషన్స్ సంయుక్త సమర్పణలో భారీ హంగులతో ఈ సినిమా రూపొందుతోంది. చిత్రానికి సంబందించిన ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరిగినట్లు తెలిసింది.