Don't Miss!
- News తండ్రైన ముఖ్యమంత్రి: తొలి నేతగా రికార్డ్
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఇంద్రగంటి మోహన్ కృష్ణ, అల్లరి నరేష్ కాంబినేషన్
ఇక ప్రస్తుతం అల్లరి నరేష్... 'లడ్డూ బాబు' చిత్రం చేస్తున్నారు. రవిబాబు ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రం అనంతరం 'బందిపోటు' ఉంటుందని చెప్తున్నారు. ప్రస్తుతం అల్లరి నరేష్ నటిస్తున్న చిత్రం 'లడ్డూబాబు' కి త్రిపురనేని రాజేంద్ర నిర్మాత. ఈ సినిమాలో నరేష్ కోసం ప్రత్యేకమైన మేకప్ విధానాలను అనుసరిస్తున్నారు. ఈ చిత్రంలో నరేష్ పాత్ర కొత్త తరహాలో వినోదాన్ని పంచేలా ఉంటుందని సమాచారం. ఇందుకు సంబంధించిన మేకప్ కోసం లండన్లోని నిపుణులను సంప్రదించారు. వారి సూచనలకు అనుగుణంగా నరేష్కి మేకప్ చేస్తున్నారు. ఇందుకోసం సుమారు మూడు గంటలపాటు మేకప్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన చిత్రీకరణ విషయంలో హీరో, దర్శకనిర్మాతలు పలు జాగ్రత్తలు తీసుకొంటున్నారు. సెట్కి యూనిట్ మినహా మరెవరూ రాకుండా చూసుకొంటున్నారు.
అలాగే తమిళంలో విజయవంతమైన 'కలగలప్పు' అనే సినిమా రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. రీసెంట్ గా నరేష్ - సత్తిబాబు కలయికలో 'యముడికి మొగుడు' వచ్చింది. ఆ చిత్రం భాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాలేదు. తమిళంలో సూపర్ హిట్టైన 'కలగలప్పు' ఇద్దరికీ విజయం తెచ్చిపెడుతుందని భావిస్తున్నారు. ఇక 'కలగలప్పు' చిత్రం ఇద్దరు స్నేహితులు తమ వారసత్వంగా వచ్చిన రెస్టారెంట్ ని ఓ రియల్ ఎస్టేట్ డవలపర్ నుంచి కాపాడుకోవటానికి చేసిన ప్రయత్నాలతో రూపొందింది. ఈ చిత్రం సోల్ కిచెన్ అనే జర్మినీ చిత్రం ఆధారంగా రూపొంది తమిళంలో మంచి విజయం సాధించింది. తెలుగులోనూ ఈ చిత్రం వర్కవుట్ అయ్యే అవకాసం ఉంది.
అల్లరి నరేష్ నట జీవితం మొదలై పదకొండేళ్లయింది. ఇప్పుడాయన హాఫ్ సెంచరీకి చేరువలో ఉన్నారు. ఈ మధ్యనే విడుదలైన 'కెవ్వు కేక' సినిమా నరేష్కి 45వ చిత్రం. 'లడ్డూబాబు' 46వది. ఇ.సత్తిబాబు, శ్రీనివాస్రెడ్డి దర్శకత్వం వహించే చిత్రాలు, కానుమిల్లి అమ్మిరాజు నిర్మించే చిత్రాలు నరేష్ చేస్తారు. 50వ సినిమాను ఇ.వి.వి.సినిమా పతాకంపై ఆర్యన్ రాజేష్ నిర్మిస్తారు. వీటికి సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడవుతాయి.