Don't Miss!
- Automobiles ప్రతి 14 నిమిషాలకు ఓ కారు మాయం.. అత్యధికంగా కార్లు చోరీ అయ్యేది ఈ నగరాల్లోనే.!!
- Technology Lava నుంచి కొత్త స్మార్ట్ ఫోన్! మార్చి 22 న లాంచ్,టీజర్ విడుదలైంది
- Finance Market Crash: సెన్సెక్స్-నిఫ్టీ నేల చూపులు.. నిండా ముంచిన ఐటీ స్టాక్స్..
- News ఆపరేషన్ పిఠాపురం ! పవన్ ఓటమికి జగన్ బిగ్ ప్లాన్ ఇదే..!
- Sports Shreyanka Patil: ఆటతోనే కాదు..అందంతోనూ క్లీన్ బౌల్డే!
- Lifestyle Chapathi Kurma: చిటికెలో రుచికరంగా చపాతీ కుర్మా రిసిపి రెడీ.
- Travel ఐఆర్సీటీసీ VIZAG - ARAKU HOLIDAY PACKAGE మార్చి 22 నుంచే..
#Naresh58 మళ్ళీ అలాంటి కధతోనే వస్తున్నాడు.. దర్శకుడు ఎవరంటే?
ఒకప్పుడు కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన మహేష్ ఇప్పుడు నటుడిగా నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నాడు. అందులో భాగంగానే ఆయన చేసిన చివరి సినిమా నాంది సూపర్ హిట్ గా నిలిచింది. ఏకంగా ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు అంటే ఈ సినిమా ఎంత బాగా ఆడిందో అర్థం చేసుకోవచ్చు. ఇక జూన్ 30వ తేదీ అంటే రేపు ఆయన పుట్టిన రోజు జరుపుకోనున్నారు. ఈ పుట్టిన రోజు సందర్భంగా ఆయన చేసే తరువాత ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఉదయం 10 గంటలకు వెలువడే అవకాశం ఉందని అంటున్నారు.
అయితే అధికారిక ప్రకటన గురించి కొన్ని వివరాలు వెల్లడయ్యాయి. టాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాను ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బానర్ మీద మహేష్ కోనేరు నిర్మాతగా అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అయితే ఇది కామెడీ సినిమా కాదని నాంది లాగే సీరియస్ సబ్జెక్ట్ అని అంటున్నారు.. మునుపెన్నడూ లేని విధంగా ఒక కొత్త విషయాన్ని స్పృశిస్తూ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు అని తెలుస్తోంది.
పూరి జగన్నాథ్ దగ్గర కొన్నేళ్లపాటు అసోసియేట్ డైరెక్టర్ గా కొన్ని సినిమాలకు పనిచేసిన సతీష్ మల్లంపాటి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.. ఈ సినిమా అల్లరి నరేష్ కి 58వ సినిమా కాబోతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రేపు ఉదయం 10 గంటలకు వెల్లడించే అవకాశం ఉంది. ఒకరకంగా మహర్షి సినిమా తరువాత నరేష్ లో ఉన్న నటుడిని చూసి చాలా మంది ఆయనకు మంచి కథలు రాస్తున్నారు. అలా పుట్టిన నాంది సినిమా నరేష్ కి మంచి పేరు తెచ్చిపెట్టింది. నాంది లో నటన బాగా నచ్చడంతో ఈ సినిమా కథ రాసుకున్నట్లు తెలుస్తోంది.