Don't Miss!
- Finance IREDA: భారీగా లాభాలను ప్రకటించిన ఐఆర్ఈడీఏ..
- Sports సూపర్ మ్యాన్ జడేజా: గాల్లోకి డైవ్ చేస్తూ ఒంటిచేత్తో క్యాచ్ Video
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్టాప్లు! ధర,స్పెసిఫికేషన్లు
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
రాజమౌళి 'ఈగ'పై ఆ సినిమాలో ప్యారడీ సీన్స్
ఓ సినిమా విజయవంతం అయ్యిందంటే వెంటనే ఆ చిత్రానికి స్పూఫ్ లు ప్యారడీలు చేసేయ్యటం మనకు ఆనవయితీనే. తాజాగా రాజమౌళి 'ఈగ' చిత్రం ఘన విజయం సాధించిన నేఫద్యంలో ఈ చిత్రం క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు కానూ అల్లరి నరేష్ ఓ స్పూఫ్ తో రెడీ అవుతున్నట్లు సమాచారం. అల్లరి నరేష్ తాజా చిత్రం సుడిగాడులో ఈ చిత్రంపై స్ఫూఫ్ రూపొందించి కలుపుతున్నట్లు ఫిల్మ్ నగర్ లో వినపడుతోంది. ఈగ ను వారు తీగ (తేనెటీగ)అని పెడుతున్నట్లుగా చెప్తున్నారు. ఈ సీన్స్ కు ధియోటర్స్ లో మంచి రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నారు. ట్రైలర్స్ లోనూ ఈగ స్పూఫ్ తోనే రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఇక అల్లరి నరేష్ కొత్త చిత్రం 'సుడిగాడు'లో పవన్ కళ్యాణ్ జల్సా ని స్పూఫ్ చేసినట్లు సమాచారం. ఈ మేరకు రిలీజ్ చేసిన పోస్టర్ కూడా జల్సా లో పవన్ తరహాలో స్టిల్ పెట్టి తీయించారు. తమిళ సూపర్ హిట్ తమిళ పదం రీమేక్ గా రూపొందున్న ఈ చిత్రాన్ని భీమినేని శ్రీనివాస రావు డైరక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో దాదాపు ఈ మధ్య కాలంలో వచ్చిన తెలుగు సినిమాలు అన్ని స్పూఫ్ లు ఉంటాయి. పూర్తిగా సినిమాలపై స్పూఫ్ గా తయారైన ఈ చిత్రం వచ్చే నెలలో విడుదల చేయనున్నారు. పాటలు ఈ నెలలో నే విడుదల చేస్తారు.
'సుడిగాడు'కి ట్యాగ్ లైన్..'ఒకే టిక్కెట్పై 100 సినిమాలు' అని పెట్టారు. ఈ చిత్రంలో అల్లరి నరేష్ హిట్ చిత్రాల పేరడీ చేస్తూ కథ నడుపుతూంటాడు. మోనాల్ గజ్జర్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి చంద్రశేఖర్.డి.రెడ్డి నిర్మాత.మోనాల్ గజ్జల్ ఇప్పటికే వెన్నెల వన్ అండ్ హాఫ్ చిత్రంలో చేసింది. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తయింది. వచ్చే నెలలో చిత్రం విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ''వినోదాత్మక చిత్రాల్లో ఇదొక వైవిధ్యమైన ప్రయత్నం. విజయవంతమైన చిత్రాల్లోని పలు సన్నివేశాల పేరడీతో కథ సాగుతుంది. ప్రతి సన్నివేశం కూడా ప్రేక్షకుడిని కడుపుబ్బ నవ్విస్తుంది. ఇటీవలే కథానాయకుడిపై పరిచయ గీతాన్ని తెరకెక్కించాం. అసలు ఈ కథలో సుడిగాడు ఎవరు? అతని కథేమిటన్నది తెరపైనే చూడాలి. ఇందులో నరేష్ నటన ప్రేక్షకులకు గుర్తిండిపోతుంది''అన్నారు. అల్లరి నరేష్ కెరీర్ లో ఈ చిత్రం మరో మైలు రాయిగా నిలిచే అవకాశం ఉందంటున్నారు. చాలా గ్యాప్ తర్వాత భీమినేని డైరక్ట్ చేస్తున్న ఈ చిత్రం పై మంచి అంచనాలే ఉన్నాయి.
పింకి పింకి పోంకి ఫాదర్ హేడ్ ఎ డాంకీ అంటూ అల్లరి నరేష్ పాడుతున్నారు. తన తాజా చిత్రం 'సుడిగాడు'కోసం ఆయన స్వయంగా ఈ పాటను పాడారు. మొత్తం ఓ ఫ్యామిలీ సాంగ్ గా ఈ పాట తెరకెక్కుతోంది. చంద్రమోహన్, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, చలపతిరావు, కోవై సరళ, హేమ తదితరులు ఇతర పాత్రధారులు. ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వివేక్ కూచిభొట్ల, సంగీతం: శ్రీవసంత్, ఛాయాగ్రహణం: విజయ్ ఉలగనాథ్.