Don't Miss!
- News వైసీపీలోకి జనసేన మఖ్య నేతలు - పిఠాపురం పై గురి..!!
- Finance Medicines News: కిరాణా కొట్టులో మందుల విక్రయం.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం..!!
- Lifestyle ప్రాణాలకు ముప్పు ఉందని తెలిపే హీట్ స్ట్రోక్ లక్షణాలు
- Technology Truecaller Spam Model స్పామ్ కాల్స్కు చెక్ పెట్టేందుకు ట్రూకాలర్ కొత్త టూల్ విడుదల..!
- Sports అనూహ్య ఘటనను ఎదుర్కొన్న రోహిత్ శర్మ
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
అరవింద్ మహా మాయగాడు...బడా నిర్మాతలు నేర్చుకోవాల్సిందే..!
అల్లు అరవింద్ మహా మాయగాడు..మాటలతోనే కోటలు దాటించగల సమర్థుడు. ప్రస్తుతం తన కొడుకు అల్లు అర్జున్ హీరోగా తను నిర్మించిన 'బద్రినాథ్" టాక్ గొప్పగా లేనప్పటికీ ఈ చిత్రం ఇరగాడేస్తోందని సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నాడు. అల్లు అరవింద్. 'బద్రినాథ్"కి కావల్సినంత పబ్లిసిటీ ఇచ్చి సినిమాని నిలబెట్టడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నాడు. దాంతో 'బద్రినాథ్" వసూళ్లు బాగానే ఉన్నాయి.
బద్రినాథ్" చిత్రానికి అట్టర్ ప్లాప్ టాక్ వచ్చినా కానీ తొలి వారంలో వసూళ్లు బ్రహ్మాండంగా వచ్చాయి. రెండవ వారంలో కూడా బద్రినాథ్ కలెక్షన్లు స్టడీగానే ఉన్నాయి. నెమ్మదిగా ఈ సినిమాని సేఫ్ జోన్ లో చేర్చి హిట్ చేసేసేలా ఉన్నారనిపిస్తోంది. ఇంచుమించు ఇలాంటి కథాంశంతోనే రూపొందిన 'శక్తి"కి కూడా ఇదే టాక్ వినిపించింది. అయితే శక్తి సినిమాని రెండో రోజునుంచే కిల్ చేసేశారు..
పాపం..అశ్వనీదత్ కి ఈ కిటుకులు తెలియవు. కాబట్టే 'శక్తి"ని ఇలా నిలబెట్టడం కోసం ప్రయత్నాలు చేయకుండా వదిలేశాడు. ఒకవేళ అశ్వనీదత్ కూడా అల్లు అరవింద్ లా పబ్లిసిటీ ఇచ్చి జనాలను మాయ చేసి ఉండి ఉంటే..'శక్తి" అంత ఘోరంగా ప్లాప్ అయ్యుండేది కాదని పరిశీలకులు అంటున్నారు.