Don't Miss!
- Sports T20 World Cup: రింకూకు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. అతని కోసమే వేటు?
- News కాకినాడలో పవన్ పై జగన్ విమర్శల్లో తడబాటు..! పాలకొల్లులో పోటీ, నాలుగో సీటు...
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
- Finance Mutual Funds: ఆ కంపెనీల్లో వాటాను పెంచుకున్న మ్యూచువల్ ఫండ్స్..
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
'త్రి ఇడియట్స్' రైట్స్ కోసం అల్లు అరవింద్ ఫైట్!?
అమీర్ ఖాన్, శర్మన్ జోషి, మాధవన్ ప్రధానపాత్రల్లో చేసిన '3 ఇడియట్స్' చిత్రం విడుదలైన పది రోజుల్లోనే 200కోట్లకు పైగా ఆర్జించి సరికొత్త రికార్డులను సృష్టించింది. దాంతో ఈ చిత్రం రీమేక్ రైట్స్ కోసం విపరీతమైన పోటీ ఏర్పడింది. ముఖ్యంగా ఈ రీమేక్ రైట్స్ కోసం రెండు అగ్ర నిర్మాణ సంస్థలు(ఒకటి గీతా ఆర్ట్స్ కాగా, మరొకటి జెమినీ ఫిల్మ్ సర్క్యూట్స్ గా చెబుతున్నారు) ప్రధానంగా పోటీ పడుతున్నారని వినపడుతోంది. అందులోనూ విధువినోద్ చోప్రా నిర్మించిన మున్నాభాయ్ సిరీస్ లో వచ్చిన రెండు చిత్రాలు జెమినీ వారే చిరంజీవితో రీమేక్ చేసే అవకాసం ఉందని చెప్తున్నారు. మరో ప్రక్క అమీర్ ఖాన్ తో అల్లు అరవింద్ గజనీ చిత్రం రీమేక్ చేసి సూపర్ హిట్ చేసారు. దాంతో వారికే రీమేక్ రైట్స్ ఇచ్చే అవకాశం ఉందని మరొక వాదన ఉంది. అందులోనూ జెమినీ సంస్థ రీమేక్ రైట్స తీసుకున్నా పవన్ కళ్యాణ్ తో ఈ చిత్రం చేద్దామనే నిర్ణయానికి వచ్చారుట. అయినా అల్లు అరవింద్ పట్టు వీడటం లేదుట. తనకే రీమేక్ రైట్స్ కావాలని పావులు కదుపుతున్నారని అంతటా వినపడుతోంది. అంతగా తన బ్యానర్ కి ఇవ్వకపోతే విధు వినోద్ చోప్రాతో కలిసి సంయుక్త నిర్మాణం చేపడటానని ప్రపోజల్ పెట్టారట. ఇదిలా ఉంటే హఠాత్తుగా సురేష్ ప్రొడక్షన్స్ పేరు తెరపైకి వచ్చింది. నమో వెంకటేశ క్రేజులో ఉన్న సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ '3 ఇడియట్స్' తెలుగు రీమేక్ రైట్స్ దక్కించుకుని వెంకటేష్, శ్రీకాంత్, శివబాలాజీ ప్రధాన పాత్రల్లో సినిమా రీమేక్ కు ప్లాన్ చేస్తోందంటూ ఓ వార్త గుప్పు మంది. దాంతో అసలు ఈ త్రి ఇడియట్స్ రీమేక్ రైట్స్ ఎవరికి దక్కుతాయినేది ఆసక్తి కరంగా మారింది.