Don't Miss!
- News కోనసీమ జిల్లాలో జనసేన ఖాళీ.. మరో నేత రాజీనామా
- Sports చరిత్ర సృష్టించిన ధోనీ.. ఒకే ఒక్కడు
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
అడ్డు పడిన అల్లు అరవింద్.. ఇరకాటంలో త్రివిక్రమ్.. చిక్కుముడి వీడేదెలా..?
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అల వైకుంఠపురములో ఏ రేంజ్ ప్రకంపనలు సృష్టిస్తుందో అందరం చూస్తూనే ఉన్నాం. సంక్రాంతి బరిలోకి దిగి ఇండస్ట్రీ హిట్ కొట్టేశాడు బన్నీ. ఇప్పటికీ సక్సెస్ ఫుల్గా రన్ అవుతున్న ఈ చిత్రం గురించి తాజాగా కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. అవేంటో ఓ సారి చూద్దాం.
బాలీవుడ్కు ‘అల'..
సౌత్ సినిమాలపై కన్నేసే బాలీవుడ్.. వాటితో బాగానే సొమ్ము చేసుకుంటోంది. గతేడాది అర్జున్ రెడ్డిని కబీర్ సింగ్గా రీమేక్ చేసి సొమ్ము చేసుకున్నారు. ప్రస్తుతం జెర్సీ సినిమానూ అక్కడ రీమేక్ చేస్తున్నారు. ఇలా మన కథలకు అక్కడ భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ క్రమంలో అల వైకుంఠపురములో చిత్రం కూడా అక్కడికి పయనమవుతున్నట్లు టాక్.
సల్మాన్ హీరోగా..
మన తెలుగు కథలపై సల్మాన్ ఖాన్కు మోజు కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడి పోకిరి చిత్రాన్ని వాంటెడ్గా రీమేక్ చేసి సెకండ్ ఇన్నింగ్స్ను మొదలు పెట్టాడు. రెడీ చిత్రాన్ని అదే పేరుతో రీమేక్ చేసి భారీ హిట్టు కొట్టాడు. మరోసారి తెలుగు కథపై కన్నేశాడని తెలుస్తోంది.
భారీ రేటుకు రీమేక్ హక్కులు..
అల వైకుంఠపురములో చిత్ర హక్కులను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వారు దాదాపు 7కోట్లకు అమ్మాలని ఫిక్స్ అయినట్టు సమాచారం. దీనికోసం ఇద్దరు మధ్యవర్తులు కూడా బాగానే పని చేశారని సమాచారం. త్రివిక్రమ్, హారిక అండ్ హాసిని కలిసి ఈ డీల్ను ఓకే చేసినట్టు తెలుస్తోంది. అయితే మధ్యలో అరవింద్ ఎంటర్ కావడంతో వ్యవహారం అక్కడే ఆగిపోయిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
Recommended Video
తానే చేస్తానంటూ..
ఇలా రీమేక్ హక్కులు అమ్మొద్దని, తానే ఈ చిత్రాన్ని బాలీవుడ్లో నిర్మిస్తానని అల్లు అరవింద్ అన్నట్టు వినికిడి. ఇప్పటికే జెర్సీ చిత్రంతో మరోసారి బాలీవుడ్కు వెళ్లిన అల్లు అరవింద్.. అల చిత్రాన్ని కూడా తానే నిర్మించాలని భావిస్తున్నాడట. అందుకే ఆ డీల్ను క్యాన్సల్ చేయమని అన్నట్టు భోగట్టా. అయితే ఎలాగైనా ఈ డీల్ను ఓకే చేయిస్తానని అవతలి పార్టీకి త్రివిక్రమ్ మాటిచ్చినట్టు, ఈ విషయమై అల్లు అరవింద్తో చర్చించాలని గురూజీ ప్రయత్నిస్తున్నాడట. మరి చిక్కుముడి ఎలా ఎప్పుడు వీడుతుందో చూడాలి.