twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లు అరవింద్ ఓ 'గొడవ మనిషి'

    By Staff
    |

    Allu Aravind
    అల్లు అరవింద్ ఎక్కడున్నా గొడవ మనిషే అని ఇండస్ట్రీలో పేరు పడింది. అటు ప్రజారాజ్యం పార్టీలో వేలు పెట్టి కార్యకర్తలకు దూరం అయ్యాడు. తాజా సమాచారం ప్రకారం మగధీర సంగీత దర్శకుడు కీరవాణితో కూడా పేచీ పెట్టుకున్నాడట. దీంతో దర్శకుడు రాజమౌళి కూడా ఆయనపై గుర్రుగా ఉన్నారని తెలిసింది.

    మొదటి నుంచి కీరవాణి ట్యూన్స్‌లో కొద్దిగా మార్పులు చేయాలంటూ... సున్నితంగా చెబుతూ... చివరికి డామినేట్ చేసేవాడట. దాంతో కీరవాణి ఆగ్రహించి.. కొన్నాళ్లు విదేశాలకు వెళ్లిపోయాడు. దీంతో సినిమా ఆగిపోతుందనే టాక్ కూడా వచ్చింది.

    మగధీర ఆడియో హక్కులు తన రికార్డింగ్ కంపెనీ వేల్స్‌కు ఇవ్వమని కీరవాణి అడిగితే.. ససేమిరా అని.. ఆదిత్యవారికి కట్టబెట్టాడట అరవింద్. దీంతో వివాదం మరింత ముదిరింది. ఇకపై గీతా ఆర్ట్స్ చిత్రాలకు సంగీతం చేయనని కీరవాణి తేల్చి చెప్పినట్లు సమాచారం. అందుకే పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్, గ్రాఫిక్స్ వర్క్ ఆలస్యమైందని అప్పట్లో చెప్పారు. కానీ అసలు కథ ఇదీ!

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X