Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
అల్లు అరవింద్ మెగా స్కెచ్.. నాగబాబు తనయుడితో ప్లాన్!
విలక్షణ కథాంశాలను ఎంచుకుంటూ సూపర్ సక్సెస్లు తన ఖాతాలో వేసుకుంటున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. మెగా ఫ్యామిలీ హీరోగా, నాగబాబు తనయుడిగా తెలుగు తెరకు పరిచయమైన ఈ యువ హీరో 'ఫిదా' సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. ఆ తర్వాత ఎఫ్2, గద్దలకొండ గణేష్ సినిమాలో మీడియం రేంజ్ స్టార్ హీరోల జాబితాలో చేరిపోయాడు వరుణ్.
మరికొద్ది రోజుల్లో ఈయన అల్లు బాబీ సమర్పణలో రూపొందనున్న కొత్త సినిమాలో నటించనున్నాడు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్గా ఇరగదీయనున్నాడు. జనవరి నెలలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని, ఇందులో వరుణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్గా నటించనుందని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే తాజాగా డైరెక్టర్ వక్కంతం వంశీ.. వరుణ్ తేజ్కి ఓ స్టోరీ లైన్ వినిపించారట. ఈ లైన్ నచ్చడంతో వెంటనే మిగితా స్టోరీ డెవెలప్ చేయాల్సిందిగా వరుణ్ పేర్కొన్నాడని తెలుస్తోంది. దీంతో వక్కంతం వంశీ ఆ పనిలో పడ్డారట. ఇక ఈ సినిమాకు అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరించనున్నారని సమాచారం.
గతంలో అల్లు అర్జున్తో 'నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా' సినిమా రూపొందించాడు వక్కంతం వంశీ. ఈ సినిమా డిసాస్టర్ కావడంతో మళ్ళీ అదే మెగా హీరోతో సినిమా చేసి విజయం సాధించాలని ప్లాన్ చేశారట వక్కంతం వంశీ. అందుకే ఈ సారి అల్లు అరవింద్ సహకారంతో వరుణ్ హీరోగా సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారట.