Don't Miss!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- News వైసీపీకి చిక్కిన లోకేష్ ట్వీట్..ఆ వెంటనే ఏం చేశారంటే..?
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
అల్లు అర్జున్ క్యారెక్టర్ చచ్చిపోతుందట..
రామ్ చరణ్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి డైరక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ పాత్ర కొద్ది సేపే ఉంటుందని, అది కూడా చనిపోతుందని, అక్కడనుంచే కథలో మలుపు తిరుగుతుందని తెలుస్తోంది. ఇక దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎవడు అనే టైటిల్ పెట్టారు. ఈ చిత్రం గురించి దిల్ రాజు మాట్లాడుతూ మా బేనర్లో రెండు హిట్ చిత్రాలను ఇచ్చిన వంశీ పైడిపల్లి చెప్పిన కథ వినగానే నాకు బాగా నచ్చింది. రామ్చరణ్ కూడా ఈ కథ విని ఎక్సయిట్ అయ్యారు. కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులేసే రామ్ చరణ్ ఈ కథపై చాలా నమ్మకం వుంచి అంగీకరించారు.ప్రస్తుతం ఈ కథ ఫైనల్ స్టేజ్లో ఉంది. ఈ కథ మెగా అభిమానుల అంచనాలకు తగ్గ విధంగా ఉండటంతో పాటు మా సంస్థ నుంచి వచ్చే చిత్రాలకు తగ్గకుండా ఉంటుంది. అన్ని వర్గాలవారిని అలరించే విధంగా ఈ చిత్రం ఉంటుంది అన్నారు.
వంశీ పైడిపల్లి మాట్లాడుతూ ఈ సంస్థలో నాకిది మూడో సినిమా. ఇది అత్యంత క్రేజీ ప్రాజెక్ట్ కావడం ఆనందంగా ఉంది. అందరి అంచనాలను చేరుకునే విధంగా ఈ కథని తయారు చేశాం అన్నారు. రీసెంట్ గానే ఈ చిత్రం పూజ కూడా జరిగింది. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ మొదలుకానుంది. ఈ చిత్రానికి సహనిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్. ప్రస్తుతం రామ్ చరణ్ తన తాజా చిత్రం రచ్చ కు తుది మెరుగుల్లో ఉన్నారు.