Don't Miss!
- Technology 6.9 అంగుళాల డిస్ప్లే, 64MP కెమెరా ఫోల్డబుల్ ఫోన్పై భారీ డిస్కౌంట్.. అమెజాన్ సేల్ పూర్తి వివరాలు..!
- News అనుభవజ్ఞుడైన నాయకుడు చంద్రబాబు: ప్రధాని మోదీ కితాబు.. సెలబ్రేషన్స్ ఇలా
- Finance API: ఫార్మా కంపెనీలకు శుభవార్త.. ఇక లాభాలే..!
- Sports ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్: ఆ ఇద్దరికీ కోత
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
పూరి స్క్రిప్టు విన్న అల్లు అర్జున్...
హైదరాబాద్ : అల్లు అర్జున్,పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో రూపొందనున్న 'ఇద్దరు అమ్మాయిలతో..' చిత్రం సెప్టెంబర్ 20 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో రీసెంట్ గా అల్లు అర్జున్ ని కలిసిన పూరీ జగన్నాగ్ ఈ మేరకు స్కిప్టు వినిపించటం జరగింది. అది విన్న అల్లు అర్జున్ చాలా ఎక్సైట్ మెంట్ తో ఉన్నారని సమాచారం. అసలు కరెక్షన్ ఏమీ చెప్పలేదని,ఈ చిత్రం తన కెరిర్ లో మరోసారి దేశముదరు రేంజిని దాటే హిట్ వస్తుందని నమ్మి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని చెప్తున్నారు.
ఇక ఈ చిత్రం షూటింగ్ మొత్తం అబ్రాడ్ లో జరపనున్నట్లు పూరీ జగన్నాధ్ తెలియచేసారు. బ్యాంకాక్ లో షూటింగ్ మొదలయ్యి అమెరికాలో జరగనుందని తెలుస్తోంది. దేశముదురు కాంబినేషన్ అల్లు అర్జున్,పూరీ జగన్నాధ్ ని రిపీట్ చేస్తూ బండ్ల గణేష్ రూపొందించే ఈ చిత్రం బారీగా రూపొందనుంది. హీరోయిన్స్ సెంట్రల్ గా నడిచే కధ కాబట్టి ఆ టైటిల్ పెట్టనున్నారని తెలుస్తోంది. ఈ చిత్రంలో చేసే ఇద్దరు హీరోయిన్స్ లో తాప్సీ ని ఎంపికచేసారు. మరొకరు కోసం చూస్తున్నారు. 2013 జనవరికి విడుదల అయ్యే ఈ చిత్రం కథ కేవలం ట్రీట్ మెంట్ బేసెడ్ గా నడుస్తుందిని సమాచారం.
అందులోనూ ఇప్పటివరకూ అల్లు అర్జున్ ఇద్దరి హీరోయిన్స్ తో మాస్ మసాలా సినిమాలు చేయకపోయవటంతో చాలా ఉత్సాహంగా ఉన్నారు. కథ తనకి కొత్తదని,తన కెరీర్ లో ఇలాంటి కథను టచ్ చేయలేదని, తన ఫ్యాన్స్ ని గ్యారెంటీగా అలరిస్తుందని అని అల్లు అర్జున్ తన సన్నిహితులుతో వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బన్నీకోసం పూరి రాసిన డైలాగులు బి జినెస్ మ్యాన్ రేంజిలో పేలుతాయనే భరోసాతో ఓకే చేసినట్లు చెప్తున్నారు.
'ఇద్దరు అమ్మాయిలతో' చిత్రం ప్రీప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో అందులోని కథానాయికలు ఎవరై ఉంటారన్న అంశం ఆసక్తికరంగా మారింది. టైటిల్కు తగ్గట్టుగా ఈ చిత్రంలో ఇద్దరు కథానాయికలు ఉంటారన్న విషయం వేరుగా చెప్పనక్కరలేదు. అయితే చిత్ర సంబంధీకులు ఎవరూ ధృవీకరించకపోయినప్పటికీ, ఇందులో ఒక హీరోయిన్గా శృతిహాసన్ పేరు బలంగా వినిపించింది. అయితే తాను ఆ చిత్రం చెయ్యడంలేదని ఆమె అంటోందట. మంచి కాంబినేషన్లో రూపొందబోయే చిత్రాన్ని ఆమె అంగీకరించలేకపోవడానికి బిజీగా ఉండటమే కారణమని వినిపిస్తోంది. కాగా ఆమెకు బదులుగా వేరొక హీరోయిన్ను ఎవరిని ఎంపిక చేస్తారోనని పరిశ్రమలో అనుకుంటున్నారు.