twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లు అర్జున్ తో గోపీచంద్ దర్శకుడు ఖరారు?

    By Srikanya
    |

    Allu Arjun
    హైదరాబాద్ : జులాయి హిట్ తో జోరు మీద ఉన్న అల్లు అర్జున్ మరో చిత్రం కమిటయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకుముందు గోపీచంద్ తో 'యజ్ఞం', బాలకృష్ణ తో 'వీరభద్ర' వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన రవికుమార్ చౌదరి దర్శకత్వంలో ఈ చిత్రం త్వరలో ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు నిర్మిస్తుండటం విశేషం. అయితే హీరో ఎవరనేది దర్శక,నిర్మాతలు చెప్పటం లేదు. గతంలో దిల్ రాజు,అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఆర్య,పరుగు చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే.

    ఈ సినిమా గురించి రవికుమార్ చౌదరి చెబుతూ ' యూత్‌ఫుల్‌గా ఉండే సినిమా ఇది. కథనం కొత్త తరహాలో ఉంటుంది. నేను చెప్పిన కథ వినగానే అరవింద్‌గారు, దిల్ రాజుగారు వెంటనే ఓకే చేయడం చాలా ఆనందంగా ఉంది. ఓ యువ కధానాయకుడు ఇందులో నటిస్తారు. కథ తయారైంది. స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తాం. సెప్టెంబర్ నెలాఖరున కానీ, అక్టోబర్ మొదటి వారంలో కానీ చిత్రం షూటింగ్ మొదలవుతుంది. బన్నీ వాసు ఈ చిత్రానికి నిర్మాత' అన్నారు. ఈ చిత్రానికి బి.వియస్ ఎన్ రవి కథ అందిస్తున్నట్లు సమాచారం.

    ఇక అల్లు అర్జున్ తాజాగా పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో ఓ చిత్రం కమిటై ఉన్నారు. అల్లు అర్జున్,పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో రూపొందనున్న 'ఇద్దరు అమ్మాయిలతో..' చిత్రం సెప్టెంబర్ 20 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో రీసెంట్ గా అల్లు అర్జున్ ని కలిసిన పూరీ జగన్నాగ్ ఈ మేరకు స్కిప్టు వినిపించటం జరగింది. అది విన్న అల్లు అర్జున్ చాలా ఎక్సైట్ మెంట్ తో ఉన్నారని సమాచారం. అసలు కరెక్షన్ ఏమీ చెప్పలేదని,ఈ చిత్రం తన కెరిర్ లో మరోసారి దేశముదరు రేంజిని దాటే హిట్ వస్తుందని నమ్మి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని చెప్తున్నారు.

    ఇక ఈ చిత్రం షూటింగ్ మొత్తం అబ్రాడ్ లో జరపనున్నట్లు పూరీ జగన్నాధ్ తెలియచేసారు. బ్యాంకాక్ లో షూటింగ్ మొదలయ్యి అమెరికాలో జరగనుందని తెలుస్తోంది. దేశముదురు కాంబినేషన్ అల్లు అర్జున్,పూరీ జగన్నాధ్ ని రిపీట్ చేస్తూ బండ్ల గణేష్ రూపొందించే ఈ చిత్రం బారీగా రూపొందనుంది. హీరోయిన్స్ సెంట్రల్ గా నడిచే కధ కాబట్టి ఆ టైటిల్ పెట్టనున్నారని తెలుస్తోంది. ఈ చిత్రంలో చేసే ఇద్దరు హీరోయిన్స్ లో తాప్సీ ని ఎంపికచేసారు. మరొకరు కోసం చూస్తున్నారు. 2013 జనవరికి విడుదల అయ్యే ఈ చిత్రం కథ కేవలం ట్రీట్ మెంట్ బేసెడ్ గా నడుస్తుందిని సమాచారం.

    English summary
    Dil Raju will be producing Ravi Kumar Chowdary’s new movie with Allu Ajrun. The movie would be jointly produced by Dil Raju and Bunny Vas. Dil Raju who listened to this script was reportedly impressed with it and looking for a good hero who suits the script.Ravi Kumar Chowdary made his debut with Manasu to.. and later made Yagnam, Veerabadra, Aatadista and Em Pillo Em Pillado..This movie is his sixth film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X