Don't Miss!
- Sports గిల్కు షాక్..రూ. 12 లక్షల జరిమానా
- Lifestyle రోజూ 10 మిరియాలు + ఒక గ్లాసు నీరు చేసే మ్యాజిక్ చూడండి! బీపీ, మలబద్ధకంతో పాటు మరెన్నో వ్యాధులకు ఇదే ఔషధం.
- Finance Baba Kalyani: ఆస్తుల కోసం కోర్టుకు.. బాబా కల్యాణి కుటుంబంలో చిచ్చు..!!
- News Arvind Kejriwal తగ్గట్లేదుగా.. ఓవైపు కోర్టులో పోరాటం; మరోవైపు అసెంబ్లీ సమావేశం!!
- Automobiles ప్రత్యర్థులకు దడపుట్టిస్తున్న బీవైడీ!.. ఉత్పత్తిలో అరుదైన రికార్డ్
- Technology ఈ Motorola ఫోన్ పై భారీ తగ్గింపు ఆఫర్! Flipkart డిస్కౌంట్ సేల్ వివరాలు
- Travel నేటి నుంచే సింహాచలంలో మహాయజ్ఞం ప్రారంభం..
గెస్ట్ రోల్ కి అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్
అల్లు అర్జున్ త్వరలో గెస్ట్ గా కనిపించనున్నాడంటూ టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది.అది మరేదో చిత్రం కాదు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా రూపొందే చిత్రంలో అని తెలుస్తోంది.సెకండాఫ్ లో వచ్చే ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో అల్లు అర్జున్ ఓ ప్రత్యేకమైన పాత్రలో మెరుస్తాడని అంటున్నారు.దిల్ రాజు నిర్మించనున్న ఈ చిత్రం కోసం అల్లు అర్జున్ ఓకే చేసాడని తెలుస్తోంది.రామ్ చరణ్,అల్లు అర్జున్ కాంబినేషన్ లో సినిమా అని ఎప్పుడునుంచో అనుకుంటున్న కోరిక ఈ సినిమాతో తీరుతుందంటున్నారు.అయితే ఆ పాత్ర రిలీజ్ వరకూ రహస్యంగా ఉంచాలని,అప్పుడే ధియేటర్ లో పేలుతుందని దర్శక,నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం. ఇక ఆ చిత్రం టైటిల్ వాడే అని తెలుస్తోంది. ఈ మేరకు రామ్ చరణ్ కూడా ఓకే చేసినట్లు చెప్తున్నారు. త్వరలోనే ఫిల్మ్ చాంబర్ లో ఈ టైటిల్ ని రిజిస్టర్ చేయించనున్నారు.
ఈ చిత్రం గురించి దిల్ రాజు మాట్లాడుతూ మా బేనర్లో రెండు హిట్ చిత్రాలను ఇచ్చిన వంశీ పైడిపల్లి చెప్పిన కథ వినగానే నాకు బాగా నచ్చింది. రామ్చరణ్ కూడా ఈ కథ విని ఎక్సయిట్ అయ్యారు. కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులేసే రామ్చరణ్ ఈ కథపై చాలా నమ్మకం వుంచి అంగీకరించారు. ప్రస్తుతం ఈ కథ ఫైనల్ స్టేజ్లో ఉంది. ఈ కథ మెగా అభిమానుల అంచనాలకు తగ్గ విధంగా ఉండటంతో పాటు మా సంస్థ నుంచి వచ్చే చిత్రాలకు తగ్గకుండా ఉంటుంది. అన్ని వర్గాలవారిని అలరించే విధంగా ఈ చిత్రం ఉంటుంది అన్నారు. వంశీ పైడిపల్లి మాట్లాడుతూ ఈ సంస్థలో నాకిది మూడో సినిమా. ఇది అత్యంత క్రేజీ ప్రాజెక్ట్ కావడం ఆనందంగా ఉంది. అందరి అంచనాలను చేరుకునే విధంగా ఈ కథని తయారు చేశాం అన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్.