Don't Miss!
- News పైసాకు పనికిరాని వ్యక్తి పవన్ - చంద్రబాబు..!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
త్రివిక్రమ్ భలే ప్లాన్ చేసాడు
హైదరాబాద్ : అల్లు అర్జున్ హీరోగా ప్రముఖ దర్శకుడు, రచయిత త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్ర రెగ్యులర్ షూటింగ్ సోమవారం హైదరాబాద్లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం పూజ ఏప్రియల్ జరిగినా షూటింగ్ ప్రారంభం చేయలేదు. తర్వాత ఇన్నాళ్లకు పట్టాలు ఎక్కించారు. దాంతో ఆ లేటుని కవర్ చేయటానికి , సినిమాని ఈ వేసవికి సిద్దం చేయటానికి త్రివిక్రమ్ భిన్నమైన ప్లానింగ్ చేసారంటున్నారు.
హీరో లేని కొన్ని సన్నివేశాలు వంటివి తన కో డైరక్టర్స్ తో వేరే లొకేషన్ లో సెకండ్ యూనిట్ పెట్టి తీస్తున్నారని తెలుస్తోంది. తక్కువ టైమ్ లో ఎక్కువ అవుట్ పుట్ కోసం ఈ పద్దతిని అనుసరిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. తెలుగులో ఎప్పుడో కానీ ఇలాంటివి చెయ్యరు.
బన్నీ పై నానక్ రామ్ గూడ స్టూడియోస్ లో ఓ ప్రక్క త్రివిక్రమ్ షూటింగ్ జరుపుతూంటే, మరోప్రక్క యూక్షన్ కొరియోగ్రాఫర్ తో హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ఓ ఛేజ్ సీన్ ని కో డైరక్టర్స్ తీస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో ఈ షాట్స్ ని ఫైనలైజ్ చేస్తారని చెప్పుకుంటున్నారు.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సమంతా, ఆదాశర్మ, రాశిఖన్నా హీరోయిన్స్ . ఏప్రిల్లో ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభోత్సవం జరుపుకున్న విషయం తెలిసిందే. జులాయి తర్వాత త్రివిక్రమ్, అల్లు అర్జున్ కలయికలో వస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.
కొత్త కథ, కథనాలతో ఫీల్గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ పాత్ర చిత్రణ సరికొత్త పంథాలో వుంటుందని నిర్మాత చెబుతున్నారు. ఈ చిత్రంలో స్నేహ, కన్నడ నటుడు ఉపేంద్ర కీలక పాత్రల్ని పోషిస్తున్నారు. ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్ సంగీతాన్నందిస్తున్నారు.