Don't Miss!
- News Modi-Hanuman Chalia:హనుమాన్ ఛాలీసాపై ప్రధాని మోదీ వివాదాస్పద వ్యాఖ్యలు..!
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
హాట్ టాపిక్ : 'బూచోడు' గా అల్లు అర్జున్
హైదరాబాద్ : అల్లు అర్జున్ త్వరలో 'బూచోడు' గా కనిపించనున్నాడా..అవుననే అంటున్నారు. అల్లు అర్జున్, సురేంద్ర రెడ్డి కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రానికి ఈ టైటిల్ ని ఖరారు చేస్తున్నట్లు ఫిల్మ్ సర్కిల్ లో వినపడుతోంది. అయితే ఇలాంటి నెగిటివ్ టైటిల్ స్టైలిష్ స్టార్ బిరుదు తెచ్చుకున్న అల్లు అర్జున్ కు ఎంతవరకూ వర్కవుట్ అవుతుందనేది ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ గా మారింది.
గతంలో ఈ చిత్రానికి 'రేసు గుర్రం' అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. క్రితం విజయదసమికి ఈ చిత్రం ప్రారంబమైంది కానీ ఇప్పటివరకూ షూటింగ్ మొదలు కాలేదు. ఈ చిత్రం షూటింగ్ ఈ నెల 18 నుంచి మొదలు కానుంది. నల్లమలుపు బుజ్జి నిర్మించే ఈ చిత్రం అప్పుడు రామానాయుడు స్టూడియోస్ లో ప్రారంభమైంది. లక్ష్మి నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. శ్రుతి హాసన్ హీరోయిన్ గా చేస్తోంది.
రచయిత వక్కంతం వంశీ మాట్లాడుతూ... అల్లు అర్జున్, సురేంద్రరెడ్డి కాంబినేషన్ లో పనిచేయటం నాకు చాలా సంతోషంగా ఉంది. పూర్తి స్ధాయి యాక్షన్ ఎంటర్టైనర్ గా చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని నమ్మకం ఉంది అన్నారు. సహ నిర్మాత డాక్టర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ...బన్నీతో కలిసి పనిచేయటం చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు.
ప్రస్తుతం అల్లు అర్జున్ పూరీ జగన్నాధ్ 'ఇద్దరమ్మాయిలతో' టైటిల్ తో ఓ సినిమా చేస్తున్నారు .'ఇద్దరమ్మాయిలతో' అనే సినిమా టైటిల్ ట్రేడ్ లో క్రేజ్ తెచ్చిపెట్టింది. ఎప్పుడూ వెరైటీ టైటిల్స్తో సినిమాలు చేసే పూరి జగన్నాథ్ ఈ చిత్రానికి స్క్ర్రిప్టుని డిఫెరెంట్ గా పూర్తి స్ధాయి వినోదం తో సమకూర్చినట్లు సమాచారం. గతంలో వీరిద్దరూ కలిసి 'దేశముదురు' సినిమా చేశారు. అది అర్జున్కు మాస్ ఇమేజ్ను పెంచింది. ఈ చిత్రం గురించి పూరి జగన్నాథ్ తెలియజేస్తూ "ఈ కథ విని బన్ని ఎంతో ఎగ్జయిట్ అయ్యాడు. ఇద్దరమ్మాయిలతో బన్ని చేస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది. మా కాంబినేషన్లో మరో విభిన్న చిత్రంగా ఇది రూపొందనుంది'' అని చెప్పారు.