Don't Miss!
- Sports IPL 2024: రుతురాజ్ గైక్వాడ్పై అంబటి రాయుడు విమర్శలు.. తప్పుబట్టిన సిక్సర్ల సిద్దు!
- Lifestyle మండిపోయే ఎండలో చల్లగా దద్దోజనాన్ని ఇలా చేసుకోండి..?
- News సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు వెళ్లేవారికి గుడ్ న్యూస్
- Automobiles కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
అల్లు అర్జున్ని సుకుమార్ ఎలా మార్చేస్తున్నాడో తెలుసా..?
ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'అల.. వైకుంఠపురములో' సినిమాలో నటిస్తున్న అల్లు అర్జున్.. ఈ సినిమా పూర్తయిన వెంటనే సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమాలో నటించనున్నారు. అల్లు అర్జున్ కెరీర్లో 20వ సినిమాగా ఈ సినిమా రూపొందనుంది. అయితే సుకుమార్ రాసుకున్న స్క్రిప్ట్ ప్రకారం ఈ సినిమాలో బన్నీ చాలా డిఫరెంట్గా మేకోవర్ కానున్నాడట.
రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ని ఎలాగైతే ప్రత్యేకంగా చూపించారో.. ఈ సినిమాలో అల్లు అర్జున్ని అంతకంటే ప్రత్యేకంగా చూపించాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమా కూడా రంగస్థలం తరహాలోనే రివేంజ్ బ్యాక్డ్రాప్లో పీరియాడిక్ డ్రామాగా ఉంటుందట. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో ఎర్రచందనం దుంగలను లారీలో స్మగ్లింగ్ చేసే వ్యక్తి పాత్రలో బన్నీ కనిపించబోతున్నాడట. అందుకే ఈ లుక్ కోసం బన్నీ చాలా రఫ్గా మారబోతున్నాడట.
ఈ సినిమాలో చిత్తూరు యాసలో బన్నీ చెప్పే డైలాగ్స్ థియేటర్లను దద్దరిల్లేలా చేస్తాయట. చిత్తూరు యాస నేర్చుకోవడానికి అల్లు అర్జున్ స్పెషల్ ట్రైనర్ని నియమించుకున్నాడని తెలుస్తోంది. సుకుమార్ క్రియేటివిటీకి తగ్గట్టుగా బన్నీ రెడీ అవుతున్నారని సమాచారం. ఈ చిత్రంలో బన్నీ సరసన క్రేజీ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్గా నటించనుంది. విలన్ గా విజయ్ సేతుపతితో కనిపించబోతున్నారని సమాచారం. అతి త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఇవ్వనున్నారు మేకర్స్.