Don't Miss!
- Technology ధర రూ.9,999 కే 108MP కెమెరా, 8GB ర్యామ్ స్మార్ట్ఫోన్.. కొనుగోలుపై స్మార్ట్వాచ్ ఉచితం..!
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- News ప్రధాని మోదీ, రాహుల్ గాంధీలకు షాక్; కోడ్ ఉల్లంఘనలపై ఈసీ నోటీసులు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అల్లు అర్జున్ అభిమానులకు దివాళీ ట్రీట్.. ఈ సారి కిక్కు మామూలుగా ఉండదట!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మెగా అభిమానులకు దివాళీ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారట. ఈ ఇద్దరి కాంబోలో రాబోతున్న హాట్రిక్ మూవీ 'అల.. వైకుంఠపురములో' సినిమా నుంచి అదిరిపోయే సర్ప్రైజ్ సిద్ధం చేశారట త్రివిక్రమ్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ భారీ రెస్పాన్స్ తెచ్చుకోవడం కారణంగా ఈ సారి ప్రేక్షకులకు డబుల్ ట్రీట్ ఇచ్చి అందరి దృష్టినీ ఇటు వైపు మళ్లించనున్నారట.
ఈ మేరకు అక్టోబర్ 27వ తేదీన 'అల.. వైకుంఠపురములో' టీజర్ రిలీజ్ చేయబోతున్నారట త్రివిక్రమ్. మాస్, క్లాస్ ఆడియన్స్ని ఒకేసారి కట్టి పడేసేలా ఈ టీజర్ కట్ చేశారట ఈ మాటల మాంత్రికుడు. ఇటీవలే ఈ సినిమాను జనవరి 12 న విడుదల చేయనున్నట్లుగా ప్రకటించింది చిత్రయూనిట్. అదే రోజు మహేష్ బాబు హీరోగా రాబోతున్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమా కూడా విడుదల కానున్న నేపథ్యంలో ఈ ఇద్దరి మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది.
గీతా ఆర్ట్స్ బ్యానర్, హారిక & హాసిని క్రియేషన్స్ సంయుక్త సమర్పణలో రూపొందుతోంది 'అల.. వైకుంఠపురములో' మూవీ. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. సుశాంత్, నివేదా పేతురాజ్, టబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. బన్నీ గత చిత్రం డిసాస్టర్ కావడంతో ఈ సినిమా ఎలాగైనా హిట్ కావాలని అల్లు అర్జున్ అంచనాలు పెట్టుకున్నారు. ఆ కారణంగానే అటు త్రివిక్రమ్, ఇటు అల్లు అర్జున్ ఈ సినిమాపై స్పెషల్ ఫోకస్ పెట్టారని తెలుస్తోంది. చూడాలి మరి ఇప్పుడు దివాళీ ట్రీట్.. జనవరిలో సంక్రాంతి ట్రీట్ ఏ రేంజ్లో ఉంటుందనేది.