చిరు..సత్యమేవ జయతే...: అల్లు శిరీష్
జీవిత రాజశేఖర్లు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ గురించి విమర్శనాస్త్రాలు సంధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిరు వర్గం ఈ దంపతులపై పరువు నష్టం దావా వేసింది. నిరాధారమైన వార్తలు ప్రచారం చేశారని, దీని వల్ల బ్లడ్ బ్యాంక్ నిందలకు గురవుతోందని సదరు వర్గం పేర్కొంది. వీరు పెట్టిన కేసుని పరిశీలించిన మీదట మియాపూర్ కోర్ట్ జీవిత, రాజశేఖర్ దంపతులకు సమన్లు జారీ చేసింది. ఈ విషయాన్ని అల్లు శిరీష్ తన ట్విట్టర్ లో పేర్కొంటూ..'సత్యమేవ జయతే" అన్నాడు.
అంటే సత్యమే జయిస్తుంది అని అల్లు శిరీష్ అర్థం..దీనికి కొంతమంది స్పందిస్తూ అంత కట్టింగ్ వద్దు నాయనా అని అంటున్నారు. చిరు బ్లడ్ బ్యాంక్ లో లోటు పాట్లు ఉన్న సంగతి వాస్తవమే. అయితే వాటికి సరైన ఆధారాలు లేకపోవడంవల్లే జీవిత రాజశేఖర్ ఇరుక్కోవాల్సి వచ్చింది అని మాట్లాడుకోవడం విశేషం.
More from Filmibeat
చిరంజీవి అల్లు శిరీష్ ట్విట్టర్ రాజశేఖర్ జీవిత బ్లడ్ బ్యాక్ chiranjeevi allu sirish twitter rajasekhar jeevitha blood bank


Click it and Unblock the Notifications











