Don't Miss!
- News పవన్ కళ్యాణ్ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
టీవీ ఛానెల్లో అల్లు శిరీష్ గోల
ఓ పాపులర్ తెలుగు టీవీ ఛానెల్ రీసెంట్ గా టాలీవుడ్ లో ఏ హీరో నెంబర్ వన్ అంటూ ఓ పోగ్రాం చేసింది. ఆ పోగ్రాంలో భాగంగా మగధీర,దూకుడు ప్రసక్తి వచ్చింది. ప్రిన్స్ మహేష్ ఫ్యాన్స్, అటు మెగా ఫ్యాన్స్ ఈ వాదోపవాదాల్లో పాల్గొన్నారు. మెగా ఫ్యాన్స్ తమ మగధీర కలెక్షన్స్ గురించి మాట్లాడుతూ..తామే టాప్ అంటూంటే...మహేష్ ప్యాన్స్ వెంటనే...వెళ్లి మీ అల్లు శిరీష్ రమ్మను..ఛాలెంజ్ చేసాడుగా..వచ్చి ప్రూవ్ చేసుకోమను అని అన్నారు. దాంతో కంగారుపడ్డ ఛానెల్ వాళ్లు సర్దిచెప్పటం జరిగింది. అలా అంతకుముందు అల్లు శిరీష్ ఫేస్ బుక్ లో చేసిన కామెంట్ ప్రస్తావనకు వచ్చింది. చర్చలో చివరకు మగధీరను రామ్ చరణ్ కి హిట్ గా,దూకుడుని మహేష్ కు హిట్ గా ఒప్పుకోవటం జరిగింది.
ఇక అప్పట్లో దూకుడు వివాదం జరుగుతున్నప్పుడు....ఫేస్ బుక్ లో దూకుడు నిర్మాత దూకుడు చిత్రం రికార్డులు ఫేక్ అని ప్రూవ్ చేస్తే కోటి రూపాయలు ఇస్తానని ప్రకటించారని రూమర్ ప్రారంభమైంది. దాన్ని నిజమని నమ్మిన కొందరు ట్విట్టర్ లో అల్లు శిరీష్ కు పోస్ట్ చేయగా దానికి స్పందనగా... “ఆఫీసులో నోటీస్ బోర్డ్, ఫేస్ బుక్ లో పెడితే ఎవడు చూస్తాడు. డేర్ ఉంటే ప్రెస్ మీట్ పెట్టి ఈ ఛాలెంజ్ డిక్లేర్ చెయ్యమను అంటూ ట్వీట్ చేసారు. దాంతో ఈ ట్వీట్ దూకుడు నిర్మాతని ఉద్దేశించే అని ప్రచారం జరుగుతోంది. అయితే మరో ప్రక్క దూకుడు నిర్మాత తనపై వచ్చిన రూమర్ ని ఖండిస్తూ ప్రకటన చేసారు.