twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లు శిరీష్ ...ఆ దర్శకుడుని ఓకే చేసాడా?

    By Srikanya
    |

    హైదరాబాద్ : కొత్త జంట చిత్రం తర్వాత అల్లు శిరీష్ లాంగ్ గ్యాప్ తీసుకున్నారు. వెంటనే ఏ ప్రాజెక్టూ ప్రారంభించలేదు. అయితే ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతున్న దాన్ని బట్టి...తాజాగా అల్లు శిరీష్ ఓ కథ విని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని. ఆ దర్శకుడు మరెవరో కాదు పరుశరామ్. యువత, ఆంజనేయులు,సోలో, సారొచ్చారు చిత్రాల పరుశరామ్ రీసెంట్ గా ఓ కథని నేరేట్ చేసారని, వెంటనే దాన్ని ఓకే చేసారని చెప్పుకుంటున్నారు. అయితే ఇప్పుడు మరో చిత్రం అల్లు శిరీష్ ఓ కొత్త దర్శకుడుతో చేస్తున్నాడని, అది అయ్యాక ఇది ఉండే అవకాసం ఉందని అంటున్నారు.

    https://www.facebook.com/TeluguFilmibeat

    మొదట ఈ స్టోరీ లైన్ ని రామ్ కోసం తర్వాత రానా తో అనుకున్నారు. కానీ ఏదీ మెటీరియలైజ్ కాలేదు. ఇప్పుడు నాగచైతన్య తో ఈ ప్రాజెక్టు ముందుకువెళ్లనుందని అనుకున్నారు. అదీ కాన్సిల్ అయ్యిందని తెలుస్తోంది. ఇప్పుడు అల్లు శిరీష్ దగ్గరకు వచ్చింది. ఈ చిత్రానికి చుట్టాలబ్బాయి అనే టైటిల్ ని పెట్టినట్లు తెలుస్తోంది.

    Allu Sirish in the direction of Prasuram?

    కుటుంబ భావోద్వేగాల ప్రధానంగా జరిగే కథగా ఈ చిత్రం ఉంటుందని అంటున్నారు. హీరో,హీరోయిన్ మధ్య వచ్చే సన్నివేశాలు బాగా వర్కవుట్ చేసాడని అంటున్నారు. అల్లు అర్జున్ కు ఈ కథని నేరేట్ చేసాడని, అయితే తన కన్నా తన తమ్ముడు అయితే సూట్ అయ్యే అవకాసం ఉందని అల్లు అర్జున్ చెప్పాడంతో, అల్లు శిరీష్ కు నేరేట్ చేసాడని చెప్పుకుంటున్నారు.

    సారొచ్చారు చిత్రం పరాజయంతో ఉన్న పరుశరామ్..ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నారు. తొలి నాటి నుంచి డైలాగులుకు ఆయన ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. పూరీ శిష్యుడైన పరుశరామ్...ఆయన బాటలోనే కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం తో రెడీ అయ్యి హీరోలను కలిస్తూంటారు.

    English summary
    Parasuram narrated a story to Allu Sirish and he at once gave green signal. The film will go to sets soon.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X