Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
రామ్ చరణ్ చిత్రంలో గెస్ట్ గా అమితాబ్
రామ్ చరణ్ తేజ త్వరలో బాలీవుడ్ లోకి భారీగా ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. అమితాబ్ సూపర్ హిట్ 'జంజీర్'రీమేక్ గా రూపొందే ఆ చిత్రంతో అమితాబ్ ఓ గెస్ట్ పాత్రలో కనిపించనున్నాడని బాలీవుడ్ సమాచారం. అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అమిత్ మెహ్రా నిర్మాత. ఈ రీమేక్లో అమితాబ్ అతిథి పాత్రలో కనపడటానికి అమితాబ్ ఆసక్తి చూపిస్తున్నాడని బాలీవుడ్ సమాచారం.
ఈ విషయమై దర్శకుడు అపూర్వ లఖియా ని మీడియా సంప్రదించింది. ఆయన మాట్లాడుతూ ''అమితాబ్ మా సినిమాలో నటిస్తున్నారని ఇంకా అధికారికంగా చెప్పలేను. ఆయన్ని సంప్రదిస్తున్న మాట వాస్తవమే. బిగ్ బి ఆశీస్సులు లేకుండా ఈ సినిమాను తీయలేం'' అన్నారు. 1973లో అమితాబ్ బచ్చన్ నటించిన చిత్రమిది. ఆ కథతోనే తాజా చిత్రం రూపొందుతోంది.
ఇక అమితాబ్ ని ఒప్పించటానికి రామ్ చరణ్ తండ్రి చిరంజీవి సైతం సీన్ లోకి వస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. చిరంజీవికి,అమితాబ్ కి మంచి రాపో ఉండటంతో అమితాబ్ ని ఒప్పించటానికి చిరంజీవి సాయిం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక రామ్ చరణ్ బాలీవుడ్ ఎంట్రీని చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. తన తోటి హీరోల రానా అక్కడ ఫెయిల్యూర్ కావటంతో ఈ చిత్రం ఎలాగైనా హిట్ కొట్టారని రామ్ చరణ్ భావిస్తున్నారు.
అలాగే ఈ చిత్రం ఆయిల్ మాఫియా చుట్టూ తిరగనున్నట్లు స్క్రిప్టుని తిరగరాసినట్లు దర్శకుడు తెలియచేసాడు. సంజయ్ దత్ ఈ చిత్రంలో విలన్ గా చేయనున్నారు. అగ్నిపధ్ లో సంజయ్ దత్ అదరకొట్టడంతో నెగిటివ్ పాత్రకు ఆయనైతేనే సరిపోతాడని భావిస్తున్నారు. ఇక రామ్ చరణ్ మాత్రం తన తాజా చిత్రం రచ్చ రిలీజ్ హడావిడిలో ఉన్నారు. ఏప్రియల్ 5న విడుదల అవుతున్న ఆ చిత్రంపై చాలా అంచనాలు ఉన్నాయి.