Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
సూపర్ స్టార్స్ ఇద్దరినీ ఒకే చిత్రంలో పూరి జగన్నాధ్
అమితాబ్బచ్చన్, రజనీకాంత్ కలిపి ఓ చిత్రంలో నటింపచేయటానికి పూరీ జగన్నాధ్ ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఈ మేరకు ముంబై మిర్రర్ పత్రిక ఓ కథనం ప్రచురించింది. గతంలో ఈ స్టార్స్ ఇద్దరి కాంబినేషన్ లో గతంలో హమ్, గిరఫ్తార్, అంధా ఖానూన్ చిత్రాలు వచ్చి విజయవంతమయ్యాయి. దాదాపు పాతికేళ్ల తర్వాత వీరిద్దరని కలుపుతూ పూరీ ఓ చిత్రం ప్లాన్ చేస్తున్నారని చెప్తున్నారు. ఈ మేరకు పూరీ రీసెంట్ గా చెన్నైయ్ వెళ్లి రజనీని కలిసి ఓ కధ వినిపించాడని చెప్తున్నారప. వెంటనే రజనీ ఇంప్రెస్ అయ్యి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు.
పూరీ జగన్నాధ్ సైతం ఈ వార్తను కన్ఫర్మ్ చేస్తూ..అవను..నేను రజనీ సార్ ని చెన్నైలో కలిసాను. ఆయనతో కలిసి పనిచేయాలని చాలా కాలంగా అనుకుంటున్నాను. అయితే ఆయనకు తగ్గ కథ నా దగ్గర లేకపోవటంతో ఇన్నాళ్లూ కలవలేదు. ఆయనతో కలిసిపనిచేయాలనేది నా లైఫ్ లాంగ్ డ్రీమ్. ఇది నాకో ఛాలెంజ్. వీరిద్దరితో సినిమా చేస్తాననే ఆశిస్తున్నాను. చూద్దాం ఏమౌతుందో అన్నారు.
ఇక గతంలో అమితాబ్ తో బుడ్డా చిత్రం చేసి ఉండటంతో ఆ పరిచయంతో అమితాబ్ డేట్స్ పట్టటుకునే పనిలో ఉన్నారు పూరీ. మహేష్ తో చేసిన బిజనెస్ మ్యాన్ చిత్రం సూపర్ హిట్ కావటంతో అందరి కన్నూ ఇప్పుడు పూరీ జగన్నాధ్ మీదే ఉంది. మరో ప్రక్కన పూరీ ..పవన్ కళ్యాణ్ తో చిత్రాన్ని మే నెల నుంచి ప్రారంభిస్తున్నారు. ఆ చిత్రం అనంతరం రవితేజతో దేముడు చేసిన మనుష్యులు చిత్రం రూపొందిస్తారు. వీటిన్నటి తర్వాత మహేష్ తో బిజినెస్ మ్యాన్ 2 రూపొందిస్తున్నారు. ఈ లోగా ఈ స్టార్స్ ఇద్దరి డేట్స్ ఎప్పుడు వీలైతాయో చూసుకుని స్క్రిప్టు వర్క్ ఫినిష్ చేసుకుని రంగంలోకి దిగుతాడంటున్నారు.