రంగమ్మత్త ప్లేస్లోకి రత్తాలు.. అనసూయ మిస్ చేసుకుందా!
దక్షణాది చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం మూడు రకాల జోనర్ చిత్రాలకు మంచి క్రేజ్ నెలకొని ఉంది. బయోపిక్ చిత్రాలు, బోల్డ్ కంటెంట్ చిత్రాలు, లేడి ఓరియెంటెడ్ చిత్రాలపై ఆడియన్స్ ఆసక్తి చూపుతున్నారు. ఓ మోస్తరు క్రేజ్ ఉన్న నేటీమణులని ప్రధాన పాత్ర దారులుగా పెట్టి చిత్రాలు తెరకెక్కిస్తున్నారు. అలాంటి చిత్రాలు మంచి ఫలితాన్ని ఇస్తున్నాయి. యాంకర్ అనసూయ టాలీవుడ్ లో నటిగా కూడా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. అనసూయ ఓ మంచి అవకాశాన్ని మిస్ చేసుకుందనే ప్రచారం జరుగుతోంది.

వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి
జూలీ2 లో రాయ్ లక్ష్మి ప్రధాన పాత్రలో నటించింది. ఆ చిత్రంలో రాయ్ లక్ష్మి అందాలని ఆరబోసిన సంగతి తెలిసిందే. ఆ చిత్రం తరువాత ఈ రత్తాలు ప్రధాన పాత్రలో నటిస్తున్న మరో చిత్రం వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి. తెలుగు తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా దీనిని తెరకెక్కిస్తున్నారు.

అనసూయకు అవకాశం
ఈ చిత్రంలో మొదట అవకాశం అనసూయకే వచ్చిందని ప్రచారం జరుగుతోంది. రంగస్థలం చిత్రంతో అనసూయ క్రేజ్ పెరిగింది. క్షణం చిత్రం తరువాత అనసూయ ఆచి తూచి సరైన పాత్రలని ఎంపిక చేసుకుంటోంది. ఆ క్రమంలో వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి చిత్రాన్ని రిజెక్ట్ చేసిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

రాయ్ లక్ష్మి రెండు భాషల్లో
ఈ చిత్ర విషయంలో మరో ప్రచారం కూడా వినిపిస్తోంది. వేర్ ఈజ్ది వెంకటలక్ష్మి చిత్రాన్ని తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు కాబట్టి రాయ్ లక్ష్మి క్రేజ్ ఈ చిత్రానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే అవకాశం ఆమె చేతుల్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.

సినిమా విడుదల తరువాత
మొత్తంగా వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి చిత్రం అనసూయ చేజారింది. అనసూయకు దక్కకుండా పోయిన ఈ ఆఫర్ మంచిదా కదా అనేది చిత్ర విడుదల తరువాత మాత్రమే తేలనుంది. ప్రస్తుతం అనసూయ కథనం, సచ్చింది గొర్రె చిత్రాలలో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











